కల్లు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

కల్లు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

Published Thu, Sep 24 2015 11:33 PM

కల్లు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి - Sakshi

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి
జహీరాబాద్ టౌన్:
కల్తీకల్లు బాధితులను ప్రభుత్వ అన్నివిధాలుగా ఆదుకొవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి కోరారు. గురువారం ఆయన జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  కల్తీకల్లుకు బానిసలైన వారు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, ప్రాణాలు కూడా కొల్పోతున్నారన్నారు.
 
రుణ మాఫీ పథకంలోపాల కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రుణ మొత్తం ఓకేసారి మాఫీ చేసినట్లయితే  మరణాల సంఖ్య తగ్గేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం శోచనీయమన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లికార్జున్ పాటిల్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, పట్టణ కన్వీనర్ పూల సంతోష్, బీజేవైఎం నియోజకవర్గం, పట్టణ కన్వీనర్లు విశ్వనాథ్ యాదవ్, నరేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement