- పోలీసుల అదుపులో ఐదుగురు..
- సీసీ కెమెరాతో చిక్కిన వైనం
- దొంగల్లో బాలుడు
వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ఐదుగురు దొంగలు పర్సులు కొట్టేస్తూ ఎస్పీఎఫ్ పోలీసులకు చిక్కారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచే పలువురు భక్తుల డబ్బులు, సెల్ఫోన్లు దొంగతనానికి గురైనట్లు ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్కానిస్టేబుల్ మహేందర్, గణేశ్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి దొంగలను పట్టుకునే పనిలోపడ్డారు. అప్పటికే అనుమానం కలిగిన కొందరిని ప్రశ్నించి వదిలిపెట్టారు. అయినా దొంగల బెడద పెరుగుతూనే వచ్చింది.
ఈలోగా ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆమేటి లక్ష్మి భర్త విజయ్కుమార్ తన పర్సును క్యూలైన్లో ఎవరో కొట్టేశారని ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఓ బాలుడు తనను వెంబడించి జేబులోని డబ్బులు తీశాడని క్లూ ఇచ్చాడు. దీంతో వారంతా కలిసి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అందులో ఓ బాలుడు పర్సు కొట్టేసినట్లు నిర్ధారించుకున్నారు. ఈక్రమంలో పరుగులు తీస్తున్న బాలుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు. దీంతో అసలు రంగు బయటపడింది.
సిద్దిపేటకు చెందిన ఈ బాలుడితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీధర్, నగేశ్, రాకేశ్ దొంగతనాలు చేరుుస్తున్నట్లు తేలింది. శాస్త్రీనగర్లోని లాడ్జి వెళ్లి తనిఖీ చేయగా ఈ ముగ్గురు దొరికినట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. రెండురోజులుగా లాడ్జిలోనే మకాం వేసి ఈ బాలుడితో దొంగతనాలు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారివద్ద నుంచి తొమ్మిది సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుల్తానాబాద్కు చెందిన సతీశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలుడు జేబు దొంగతనాలు చేస్తూ ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.
జేబు దొంగలు దొరికారు..
Published Tue, Sep 16 2014 12:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement