సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్త లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగించడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కోలుకునేందుకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. పెద్ద కంపెనీల నుంచి వచ్చే ఆర్డర్లపైనే ఎంఎస్ఎంఈ పరిశ్రమల మనుగడ ఆధారపడి ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కనీసం 25 శాతం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు శాశ్వతంగా మూతపడే అవకాశం ఉందని పారిశ్రామిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలతో పాటు పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు నిర్ణయం తీసుకోవాలంటూ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), భారతీయ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కి), అసోచామ్ కేంద్రాన్ని కోరాయి.
10 వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు
తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టిఫ్) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 10 వేలకు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలున్నాయి. వీటి ద్వారా సుమారు 15 లక్షలకు పైగా మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించిన వేతనాలను సర్దుబాటు చేసిన ఎంఎస్ఎంఈలు తమ ఖాతాల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఏప్రిల్ వేతనాల చెల్లింపుపై మల్లగుల్లాలు పడుతున్నాయి. లాక్డౌన్ పొడిగింపు తెలివైన నిర్ణయమే అయినా తమ పరిశ్రమల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతోందని యాజమాన్యాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో తమ వద్ద నగదు నిల్వలు నిండుకుంటే తలెత్తే పరిస్థితిపై ఆందోళన చెందుతున్నాయి.
నిబంధనలు సడలించాలని వినతి
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున నిబంధనలు సడలించేలా ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేయాలని పారిశ్రామిక సంఘాలు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. నిరర్ధక ఆస్తుల గుర్తింపు నిబంధనలను కనీసం రెండేళ్ల పాటు సడలించాలని ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కోరుతున్నాయి. మరోవైపు రుణాల అసలు, వడ్డీ చెల్లింపుపై ప్రభుత్వం విధించిన మూడు నెలల మారటోరియాన్ని కూడా పొడిగించాలని ఎంఎస్ఎంఈలు డిమాండ్ చేస్తున్నాయి. రుణాల చెల్లింపుపై మారటోరియంతో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు, నిర్వహణ పెట్టుబడి, మార్టగేజ్ రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
రూ.10 లక్షల కోట్ల ప్యాకేజీ..
లాక్డౌన్ మూలంగా దేశవ్యాప్తంగా రోజుకు రూ.40 వేల కోట్లు నష్టం వాటిల్లుతుండగా, ఇందులో పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా ఉందని సీఐఐ, ఫిక్కి వంటి సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగాల వారీగా భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఈ సంఘాలు కోరుతున్నాయి. దేశ జీడీపీలో 5 శాతం మేర అనగా సుమారు రూ.10 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని పారిశ్రామిక రంగానికి ప్రకటించాలనేది వీరి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలతో పాటు పారిశ్రామిక రంగానికి ఊతం లభిస్తుందని ‘టిఫ్’వర్గాలు వెల్లడించాయి. ఇటు వచ్చే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఎరువులు, విత్తనాలు, ఫుడ్ ప్రాసెసింగ్, బ్రేవరేజెస్ పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపునివ్వాలని పారిశ్రామిక సంఘాలు ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం.
చిన్న పరిశ్రమకు పెద్ద సమస్య
Published Sun, Apr 19 2020 1:25 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement