కరోనా : కొత్తగా 154 కేసులు, 14 మంది మృతి | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో 154 కరోనా కేసులు

Published Sun, Jun 7 2020 10:03 PM

Coronavirus: 154 New Positive Cases Registered In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఆదివారం ఒక్కరోజే 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గరిష్టంగా 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు 3,650కు చేరింది. మొత్తంగా 137 మంది ప్రాణాలు కోల్పోగా,  1,742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 1,771 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
(చదవండి : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం)

కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 132 జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2, సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌లో ఒక్కో కేసు నమోదైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Advertisement
Advertisement