సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి యువతపై పంజా విసురుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్లో నమోదైన కేసులను విశ్లేషిస్తే.. కరోనా వైరస్ బారిన పడ్డ వారిలో యువకులు, నడివయస్కులే అధికంగా ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో వృద్ధులు, చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండగా.. మన హైదరాబాద్లో మాత్రం అన్ని వయసుల వారిపైనా ఆ ప్రభావం ఉంది. ఈ నెల 19వ తేదీ నాటికీ హైదరాబాద్ నగరంలో 395 మందికి కరోనా వైరస్ సంక్రమించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో అధికంగా 76 మంది 21 నుంచి 30 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. అదేవిధంగా 20 ఏళ్ల లోపు వయసున్న వారు 106 మంది ఉన్నారు. ఆ తర్వాత మధ్య వయస్కులపై ఈ రక్కసి ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన అనంతరం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. రాష్ట్రంలో వెలుగు చూస్తున్న కేసుల్లో 80% నిజాముద్దీన్కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారి తో సన్నిహితంగా మెలిగినవారే ఉన్నారు.
దడ పుట్టిస్తున్న పాతబస్తీ...
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైన కేసుల్లో అధిక భాగం పాతనగరం (ఓల్డ్ సిటీ)వే కావడం అధికార యంత్రాంగాన్ని, ఇటు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. సౌత్జోన్ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను సైతం పెంచుతూ వస్తోంది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 395 కేసులుండగా.. ఇందులో సౌత్జోన్లో 167 కేసులున్నాయి. అలాగే సౌత్జోన్తో అనుబంధంగా ఉండి.. ఎక్కువ రాకపోకలు జరిగే వెస్ట్ జోన్లో కూడా కేసుల సంఖ్య 138గా నమోదైంది. ఈ జోన్లలో సోమవారం నాటికీ 51 ప్రాంతాలను కంటైన్మెంట్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్ల పరిధిలోకి వచ్చే ఇళ్లను జల్లెడ పడుతూ కరోనా లక్షణాలతో పాటు జలుబు, జ్వరం వస్తున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు వేగిరం చేసింది. మరోవైపు ప్రతి పౌరుడికీ వైద్యపరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా ఇప్పటికే కరోనా వచ్చిన వారి నుంచి ఇంకెంతమందికి ఈ వైరస్ సోకిందో తేలుస్తోంది.
యువతపై కరోనా పంజా!
Published Wed, Apr 22 2020 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement