కేతేపల్లి: ప్రమాదాల నివారణకు కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద సర్వీసురోడ్డు, అండర్పాసింగ్ నిర్మాంచాలని కోరుతూ శుక్రవారం గ్రామస్తులు హైవేపై ఆందోళన నిర్వహించారు. గురువారం సాయంత్రం ఇనుపాముల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన తిరుగుడు అంతయ్య(45) మృతిచెందగా, పట్టేటి విద్యాసాగర్ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం స్థానిక బస్స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న సూ ర్యాపేటకు చెందిన వృద్ధురాలు గుంటి జగదాంబ(70)ను కారు ఢీకొట్టడంతో మృతిచెం దింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మహిళలు వందలాదిగా హైవే పైకి చేరుకుని ధర్నా నిర్వహించారు. మృతదేహాలను రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ వి.బాలగోపాల్ సిబ్బందితో కలసి సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్హెచ్ఏఐ అధికారులకు విన్నవించి పరిష్కరించుకోవాలని, హైవేపై ట్రాఫిక్ను అడ్డకోవటం సరికాదన్నారు.
దీంతో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలోని సమస్యలను జిల్లా అధికారుల నుంచి కేంద్ర మంత్రుల వరకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదనవ్యక్తం చేశారు. జీఎ మ్మార్ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి తమ గ్రామంలో అండర్పాస్ నిర్మిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఆందోళనకారులు వందల సంఖ్యలో ఉండటం, పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటంతో పోలీసులు చేసేదేమీ లేక జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అం దించారు. రాస్తారోకో ప్రారంభమై అప్పటికే రెండు గంటల సమయం దాటిపోవటంతో హైవేకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న నల్లగొండ డీఎస్పీ రాములునాయక్, నకిరేకల్, శాలి గౌరారం, సూర్యాపేట సీఐలు సురేష్రెడ్డి, ప్రవీణ్కుమార్, వై.మొగిలయ్య, పలువురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు.ఆయా గ్రామా ల అవసరాల మేరకు ఇనుపాముల వద్ద అండర్పాసింగ్,సర్వీసు రోడ్లు నిర్మించాల్సిన అవసరాన్ని డీఎస్పీరాములునాయక్ ఎన్హెచ్ఏఐ, జీఎమ్మార్ అధికారులకు ఫోన్లో వివరించారు. సమస్యలను స్థానిక ఎంపీ సిఫారసుతో రాత పూర్వకంగా నివేదిస్తే కేంద్ర అధికారులకు విన్నవించి అనుమతులు పొందుతామని ఎన్హెచ్ఏఐ అధికారులు డీఎస్పీకి తెలిపారు.అయిన్పటికీ ఆందోళనకారులు రాస్తారోకో విరమించేందుకు ఒప్పుకోలేదు. చివరి డీఎస్పీ రాములునాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో మరోసారి మాట్లాడి ఎన్హెచ్ఏఐ, జీఎమ్మార్ అధికారులతో శుక్రవారం సాయంత్రం ముఖాముఖి సమావేశాన్ని ఖరారు చేయటంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు.
మృతదేహాలతో హైవేపై ఆందోళన
Published Sat, Feb 28 2015 3:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement