సాక్షి, రంగారెడ్డి జిల్లా : మొక్కజొన్న పంట బీమాపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. వాస్తవానికి జులై నెలాఖరు నాటికి బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లింపు గడువు ముగిసింది. అయితే సర్కారు వైఖరితో జిల్లా రైతాంగం ప్రీమియం చెల్లింపునకు నోచుకోలేదు. తాజాగా తేరుకున్న జిల్లా వ్యవసాయ శాఖ.. బీమా చెల్లించేం దుకు రైతులకు గడువు ఇవ్వాలంటూ బీమా సంస్థకు లిఖితపూర్వకంగా కోరినప్పటికీ ఈ అంశంపై స్పష్టత రాకపోవడంతో రైతుల చివరి ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి కనిపిస్తోంది.
వారంలో తేలకుంటే అంతేసంగతి..
సాధారణంగా పంటబీమాకు సంబంధించి ప్రతి రైతు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణం పొందే రైతులకుగాను నేరుగా వారి బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం డబ్బులు కోత పెట్టి మిగతా రుణాన్ని రైతుకు ఇస్తారు. కానీ బ్యాంకు రుణం పొందని రైతులు మాత్రం నేరుగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జులై31 నాటితో గడువు ముగిసింది.
జిల్లాలో మొక్కజొన్న పంటబీమాపై ప్రభుత్వం ఇప్పటికీ ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. ఫలితంగా ప్రీమియంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో జిల్లా రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. ఇటీవల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో చర్యలకు దిగిన జిల్లా వ్యవసాయశాఖ ఇన్యూరెన్స్ సంస్థకు లిఖితపూర్వకంగా పరిస్థితిని వివరించారు.
స్పందన కరువు..
జిల్లాలో గతేడాది మొక్కజొన్న కు సంబంధించి రెండువేల మంది రైతులు బీమాకు దరఖాస్తు చేసుకుని ప్రీమియం చెల్లించారు. అదేవిధంగా బ్యాంకు రుణాలు పొందిన రైతుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో బీమా ప్రీమియం చెల్లించారు. తాజాగా ప్రభుత్వం బీమాకు సంబంధించిన ఉత్తర్వులివ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేదు. మరోవైపు బీమా సంస్థకు లిఖిత పూర్వకంగా లేఖ రాసినా స్పందన కరువైంది.
ప్రస్తుతం జిల్లాలో 30వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగవుతోంది. తాజాగా నెలకొన్న కరువు పరిస్థితులతో పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులకు బీమాకు అర్హులైతే నష్టం వచ్చినా కొంతైనా లబ్ధి చేకూరేది. కానీ బీమాపట్ల స్పష్టత లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది.
బీమా లేనట్టే!
Published Sun, Aug 10 2014 12:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement