- మే 14న భూ సేకరణకు నిరసనగా జైల్ భరో కార్యక్రమం
- తెలంగాణలో జలవిధానంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
హైదరాబాద్: సీపిఐ తెలంగాణకు వ్యతిరేకమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని సీపిఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టం సామాన్య ప్రజలకు, రైతులకు వ్యతిరేకమని ఆయన అన్నారు. చాడా వెంకటరెడ్డి గురువారం ఆయన విలేకరుతో మాట్లాడుతూ భూ సేకరణకు నిరసనగా మే 14న జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని చాడా వెల్లడించారు. తెలంగాణలో జలవిధానంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.