పంట నష్టం అంచనాకు బృందాలు: పార్థసారథి | Sakshi
Sakshi News home page

పంట నష్టం అంచనాకు బృందాలు: పార్థసారథి

Published Sat, Aug 25 2018 2:18 AM

Crews to predict crop damage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కుండపోత వర్షాలకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందాలు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి కలెక్టర్లను ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేసి నాలుగైదు రోజుల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు శుక్రవారం కలెక్టర్లకు లేఖ రాసినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. సర్వే నిర్వహించి గ్రామాల వారీగా, పంటల వారీగా నష్టాన్ని అంచనా వేయాలన్నారు. నష్టం జరిగిన చోట్ల ఏయే పంటలకు రైతులు బీమా ప్రీమియం చెల్లించారో కూడా తెలుసుకోవాలన్నారు.

Advertisement
Advertisement