రైతులకు మంత్రులు ఈటల, పోచారం హామీ
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయలలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తే వెనక్కి ఇప్పిస్తామని మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. పంట రుణాలపై కేంద్రం ఇచ్చే వడ్డీ రాయితీకి తోడు 4 శాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని... ఈ వడ్డీని రైతుల నుంచి వసూలు చేయవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వారు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో బ్యాంకర్ల కమిటీ భేటీ అనంతరం ఈటల, పోచారం మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు 80 శాతం పంట రుణాలు పంపిణీ చేయాలని తీర్మానం చేశామని, దీని పురోగతిపై ప్రతి వారం నివేదికలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ఏడాది మొత్తం పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.25వేల కోట్లు కాగా.. ఖరీఫ్ లక్ష్యం రూ.18వేల కోట్లు అని, ఇందులో ఇప్పటివరకు రూ.7 వేల కోట్ల పంపిణీ జరిగిందని తెలిపారు. రుణమాఫీ పొందిన 35 లక్షల మందిలో 16 లక్షల మంది రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకున్నట్లు చెప్పారు.
రుణ మాఫీ పొందిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ విభాగం తరఫున రుణమాఫీ పత్రాలను అందజేసిందని... అదే తరహాలో రుణ విముక్తి పొందినట్లు ధ్రువీకరిస్తూ బ్యాంకుల నుంచి అనెక్సర్-ఎఫ్ పత్రాన్ని జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి మరింత ఆస్కారమున్నట్లుగా గుర్తించిన బ్యాంకర్లు ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికను రూ.72,112 కోట్ల నుంచి రూ.78,776 కోట్లకు పెంచారని మంత్రి ఈటల చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని... రుణాల మంజూరుకే కాకుం డా గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కోరారు. వర్షాధారంపై వరి నాట్లు వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని... రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన వైపు బ్యాంకర్లు దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమలను ప్రోత్సాహించేం దుకు ప్రభుత్వం చేపడుతున్న సింగిల్ విండో విధానం, రాయితీలకు తోడుగా బ్యాంకర్లు సైతం రుణసాయం అందించాలని, అవసరమైతే రీ ఫైనాన్స్ చేయాలని అన్నారు.
వడ్డీ వెనక్కి ఇప్పిస్తాం
Published Sat, Sep 5 2015 3:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement