⇒ మహాశివరాత్రి జాతర ప్రారంభం
⇒ పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్రావు
సాక్షి, మెదక్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల భక్తులతో కిటకిటలాడింది. జై దుర్గాభవానీ.. హరహరమహాదేవ అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆ ప్రాంత పరిసరాలు మారు మోగాయి. తెలంగాణతోపాటు పొరుగునే ఉన్న మహా రాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్ర మైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలో శివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర వేడుకలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు.
డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. భక్తులు అమ్మ వారికి పూజలు నిర్వహించటంతోపాటు మొక్కులు సమర్పించుకున్నారు. పవిత్ర మంజీరా నదిలో స్నాన మాచరించిన అనంతరం భక్తులు అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఉపవాసం ఆచరించిన భక్తు లు అమ్మవారిని దర్శించుకోవటం తోపాటు ఆలయ మహాగోపురం వద్ద ఉన్న శివాల యంలో అభిషేకాలు చేశారు. ఉపవాస వ్రతం ఆచరించిన సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారి సన్నిధిలో ఉపవాసదీక్షను విరమించారు.
తల్లీ.. విపక్షాలకు సద్బుద్ధిని ప్రసాదించు: హరీశ్
రాష్ట్రానికి, రైతులకు మేలు చేసే ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, వారికి ఇకనైనా సద్బుద్ధిని ప్రసాదించాలని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ను ప్రార్థించినట్లు మంత్రి హరీశ్రావు అన్నారు. భవానీమాత ఆలయ అభివృద్ధి కోసం రూ.4 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రబీలో దుర్గమ్మ ఆశీస్సులతో ఘనపురం ఆనకట్ల కింద 18వేల ఎకరాల సాగు అయినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి టెయిల్ఎండ్ వరకు సాగునీరు అందజేసి మొత్తం 21 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తామని చెప్పారు.
జనసంద్రమైన ఏడుపాయల
Published Sat, Feb 25 2017 2:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement