అమలులోకి ఎన్నికల కోడ్
నర్సాపూర్: ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి దళితుల భూ పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. స్వాతంత్య్ర దినోత్సవం నాడే దళితులకు భూ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ నర్సాపూర్ నియోజకవర్గంలో ఏ ఒక్క మండలంలో భూ పంపిణీ చేపట్టలేదు. భూములను గుర్తించి కొనుగోలు చేసేందుకు సిద్ధమైనా, నిధులు విడుదల కాకపోవడంతో పంపిణీ జరగలేదు. కొన్ని మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి కానందున పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. కాగా మెదక్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు కమిషన్ నిర్ణయం తీసుకున్నందున ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు భూ పంపిణీ జరిగే అవకాశాలు లేవు.
దీంతో ఎంపికైనా లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. నర్సాపూర్ మండలంలోని మూసాపేటలో 19 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి, 57ఎకరాల భూములను గుర్తించి కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రయత్నం చేపట్టినా కొనుగోలు ప్రక్రియ వాయిదా పడింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పాటు, గుర్తించిన భూమికి చెందిన ఒక పట్టేదారు అందుబాటులో లేకపోవడం మరో కారణమని తెలిసింది. గుర్తించిన భూములను స్థానిక తహశీల్దార్ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను సైతం గుర్తించి కేటాయించారు. కాగా లబ్దిదారులను, భూములు గుర్తించేందుకు స్థానిక అధికారులు, నాయకులు ఎంతగానో శ్రమించారు.
కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో ఇద్దరు భూమిలేని లబ్ధిదారులను గుర్తించినప్పటికీ భూమి కొనుగోలులో జాప్యం జరగడంతో పంపిణీ కార్యక్రమంలో జరగులేదు. శివ్వంపేట మండలంలోని రత్నాపూర్లో భూములు పంపిణీ చేయాలని నిర్ణయించినా భూముల కొనుగోలు చేపట్టనందున పంపిణీ జరగలేదు. హత్నూర మండలం కొన్యాలలో భూములు పంపిణీ చేపట్టాలని యోచించినా లబ్ధిదారుల గుర్తింపు జరగలేదు. వెల్దుర్తి మండలంలో రామంతాపూర్, ఉప్పులింగాపూర్ గ్రామాల్లో ఏదో ఒక గ్రామాన్ని ఎంపిక చేయాలని అధికారులు నిర్ణయించగా రెండు గ్రామాల్లో భూములు దొరికే పరిస్థితులు లేకపోవడంతో మండలంలో భూ పంపిణీ ఆదిలోనే ఆగిపోయింది. కౌడిపల్లి మండలంలోని శిలాంపల్లిలో లబ్ధిదారులను గుర్తించినా భూముల కొనుగోలు ప్రక్రియ పూర్తి కానందున ఎవరికి భూములు పంపిణీ చేయలేదు.
ఎన్నికల కోడ్ అమలులో ఉంది
ఉప ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి నందున పంపిణీ విషయం ఇప్పుడేమీ చెప్పలేమని స్థానిక తహశీల్దార్ అన్వర్ మహమ్మద్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కార్యక్రమం చేపడతామన్నారు.
దళితుల భూ పంపిణీకి బ్రేక్!
Published Sun, Aug 17 2014 10:27 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement