నిరుపేద దళిత నిరుద్యోగుల స్థానంలో ధనికులు పాగా వేశారు.
వారికి కేటాయించాల్సిన దుకాణాల్లో బినామీలు అడ్డా పెట్టారు.
ఫలితంగా అర్హుల స్థానంలో అనర్హులు లబ్ధిపొందుతున్నారు.
దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్టు నిరుపేద దళితులు మొత్తుకుంటున్నా పట్టించుకునే దిక్కు లేదు.
కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు.
- మెదక్
* దళితుల దుకాణాలు ధనికుల పాలు
* అర్హులైన ఎస్సీలకు అన్యాయం
* అనర్హులకు కొమ్ముకాస్తున్న అధికారులు!
* ఆందోళనలు చేసినా పట్టించుకోని వైనం
* కలెక్టర్కు ఫిర్యాదుచేసినా ఫలితం శూన్యం
ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2006లో మెదక్ పట్టణంలో ప్రభుత్వం సుమారు రూ.20 లక్షలు వెచ్చించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది. స్థానిక జీకేఆర్ కాంప్లెక్స్ సమీపంతోపాటు రామాలయ సమీపంలో 20 షాపులకు మున్సిపల్ అధికారులు వీటిని నిర్మించారు. ఈ షాపులను అర్హులైన దళితులకు అద్దెకు ఇవ్వాలి. ఆ మడి గెలో ఏదైన వ్యాపారం చేసుకుని జీవనోపాధి పొందాలి. కానీ వాటిని కొందరు రాజకీయ పలుకుబడితో దక్కించుకున్నారు. సదరు వ్యక్తులు ఇతరులకు అద్దెకిచ్చి అధికంగా వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ కాంప్లెక్స్లు అన్ని బినామీల పేర్లపైనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆ షాపుల్లో కిరాయికి ఉంటున్న వారంతా ధనికులే కావడం గమనార్హం. ఆ షాపుల నుంచిబినామీలను పంపించి వేయాలని పలువురు నిరుపేద దళితులు మున్సిపల్ అధికారులతోపాటు కలెక్టర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితంలేక పోవడంతో ఈనెల 6న రాస్తారోకో చేశారు. అయినా మున్సిపల్ అధికారులు బినామీలకే కొమ్ముకాస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల తీరుతో ఎందరో నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇ ప్పటికైనా అధికారులు స్పందించి బినామీలను ఖాళీ చేయించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అనర్హుల చేతిలో కాంప్లెక్స్లు...
దళితుల కోసం కేటాయించిన దుకాణాల్లో అగ్రవర్ణాల వారితోపాటు ధనికులు అద్దెకుం టున్నారు. దీంతో అర్హులైన నిరుద్యోగ దళితులకు అన్యాయం జరుగుతుంది. బి నామీలను ఖాళీ చేయించి అర్హులకు ఇవ్వాలని రాస్తారోకో చేపట్టినా స్పందించడం లేదు. కలెక్టర్ స్పందించి అక్రమంగా అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించాలి.
- బాల్రాజ్, మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు
ఆందోళనలు చేపడతాం..
దళితుల కోసం కేటాయించిన షాపుల్లోంచి అనర్హులను ఖాళీ చేయిం చాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. కళ్లముందే అక్రమాలు కన్పిస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అనర్హులను ఖాళీచేయించి అర్హులకు కేటాయించాలి.
- యాదగిరి, ఎమ్మార్పీఎస్ పట్టణ కార్యదర్శి
బినామీల అడ్డా!
Published Wed, Jan 20 2016 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement