కనగల్ :దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవు లు తెలిపారు. కనగల్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని హైదలాపురంలో గురువారం ఆయన భూపంపిణీ పథకం లో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల తో సమావేశమయ్యారు. మొదటి విడత భూ పంపిణీకి ఎంపికైన ఆదిమల్ల లక్ష్మ మ్మ, మాధవి, సరిత, శివకుమారి, పగడాల అంజలి వివరాలను అడిగి తె లుసుకున్నారు. భూపంపిణీకి వీరు అర్హులేనా అని గ్రామసభలో ప్రజలను అడిగారు. గ్రామంలో సాగుకుయోగ్యమైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఇతరుల నుంచి 17 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ వివరించారు.
గ్రామ ంలో ఎకరం భూమి ఎంత ధర పలుకుతుందని కలెక్టర్ అడిగారు. సుమారు రూ 3లక్షల నుంచి రూ. 3.5 లక్షల దాకా పలుకుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకుయోగ్యమైన భూమిని లబ్ధిదారులకు చూపించి వారు నచ్చితేనే కొనుగోలు చేయాలన్నారు. దళితులకు పంపిణీ చేసే భూములను అమ్మడానికి కొనడానికి వీల్లేదన్నారు. ఒక వేళ క్రయవిక్రయాలు జరిపినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిలేని ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకవేళ అర ఎకరం, ఎకరం భూమి ఉన్నవారికి సైతం ఆ భూమి మినహా మిగతా భూమి ని ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలి పారు.
నల్లగొండ నియోజకవర్గ పరిధిలో హైదలాపురం గ్రామాన్ని భూపంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఆగస్టు 15న మహిళా లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేస్తామన్నారు. అనంతరం దళితులకు పంపిణీ చేసే భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ ఎండీ జహీర్, కనగల్ తహసీల్దార్ ఎం. వెంకన్న, ఆర్ ఐ ధర్మారెడ్డి, ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు, వీఆర్ఓ రాంచందర్రావు, సర్వేయర్ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే నార్కట్పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో కూడా దళితులకు పంపిణీ చేయనున్న భూమిని కలెక్టర్ పరిశీలించారు.
దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ
Published Fri, Aug 8 2014 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement