* పంద్రాగస్టు వేడుకలను ఇక్కడ నిర్వహించొద్దు
* రెవెన్యూ సిబ్బందికి డిఫెన్స్ హెచ్చరిక
* మోహరించిన సైనికులు, పోలీసులు
* గోల్కొండ కోట వద్ద గడబిడ
* నేడు కలెక్టర్ వద్ద పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇదంతా డిఫెన్స్కు చెందిన స్థలం. ఈ స్థలంలో ఎవరైనా కాలు మోపితే ఊరుకోం’ అంటూ... సైనిక విభాగానికి చెందిన అధికారులు రెవెన్యూ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం గోల్కొండ కోట వద్ద జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని కుదిపేసింది. కోట దిగువన ఉన్న ఖాళీ ప్రదేశం వద్దకు వందలాది మంది సైనికులు చేరుకున్నారు. అది డిఫెన్స్కు చెందిన స్థలంగా బోర్డును కూడా పెట్టేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, డిఫెన్స్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారనుండడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు భారీగా మోహరించారు. ఈలోగా అక్కడికి చేరుకున్న రెవెన్యూ ఉన్నతాధికారులు, మిలిటరీ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. స్థలానికి సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను తీసుకొని నేడు జిల్లా కలెక్టర్ వద్దకు పంచాయితీకి రావాలని సూచించారు. డిఫెన్స్ అధికారులు కూడా అందుకు అంగీకరించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఖాళీ ప్రదేశంలో డిఫెన్స్ అధికారులు పెట్టిన బోర్డును రెవెన్యూ అధికారులు పీకేశారు.
పరేడ్ పరేషాన్
పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోట వద్ద నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో ఈ సంఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరణకు ఏ ఇబ్బందులూ లేకున్నా ఈ సందర్భంగా నిర్వహించనున్న పోలీసు పరేడ్తోనే సమస్యలు చుట్టుముట్టాయి. పరేడ్ కోసం కోట వెనుక భాగాన 244, 245, 246 సర్వే నంబర్లలో ఉన్న 51 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసిన అధికారులు మంగళవారం సాయంత్రం వరకు సర్వే నిర్వహించారు.
అనంతరం ఆ స్థలం తమదంటూ డిఫెన్స్ అధికారులు సీన్లోకి వచ్చారు. ముందస్తుగా ప్రభుత్వం డిఫెన్స్ అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఉంటే ఈ సంఘటన చోటుచేసుకునేది కాదని మిలిటరీ ఆధీనంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్లో ఏటా ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను నిర్వహించడం పరిపాటేననీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గోల్కొండ ఆర్కియాలజీ శాఖ పరిధిలో ఉన్నందున ఆ విభాగం నుంచి అనుమతి కోరుతూ టీ సర్కారు ఓ లేఖ రాసింది. అలాగే డిఫెన్స్వారినీ అనుమతి కోరనుంది.
ఇది మా భూమి
Published Wed, Aug 6 2014 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement