సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఆన్లైన్ కౌన్సెలింగ్లో సీటు లభించినా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేసి ఫీజు చెల్లి స్తేనే ఆ విద్యార్థికి సీటు కన్ఫార్మ్ చేసే విధానికి ఇక చెక్ పడనుంది. విద్యార్థులు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి తమ సీటు కన్ఫర్మ్ చేసుకునే విధానం రాబోతోం ది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులు ఆన్లైన్లోనే ఫీజు చెల్లిం చేలా చర్యలు చేపట్టేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2019–20 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల సన్నాహక సమావేశం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలను మరింత సులభతరం చేయాలని నిర్ణయిం చారు. ఈసారి ప్రవేశాల ప్రక్రియను పూర్తి పేపర్లెస్ గా నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు. విద్యార్థు ల రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చే వన్టైమ్ పాస్వర్డ్ నుంచి మొదలుకొని కాలేజీలో చేరే వరకు అంతా ఆన్లైన్లోనే సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను కూడా ఆన్లైన్లోనే సేకరించి వెరిఫికేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
హెల్ప్లైన్ల ద్వారా సమస్యల పరిష్కారం..
విద్యార్థుల సమస్యలన్నింటినీ హెల్ప్లైన్ కేంద్రంలోనే పరిష్కరించేలా అధికారం కల్పిస్తామని లింబాద్రి పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు అందరికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు వారు వెబ్సైట్లో ఫలితాలను డౌన్లోడ్ చేసుకునేప్పుడే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు వివరాలు కూడా డౌన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇస్తామని, అందులో విద్యార్థులు ఎలా డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలో ఉంటుందని స్పష్టం చేశారు.
డిగ్రీ ఫీజు చెల్లింపులు ఆన్లైన్లోనే
Published Thu, Feb 7 2019 1:05 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement