‘భారత-చైనా మిత్రమండలి’ జాతీయ మహాసభల్లో వక్తలు
హైదరాబాద్: ప్రపంచంలో యుద్ధాలు, అల్లర్లు సృష్టించిన ఏ దేశమూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లలేదని ‘భారత్-చైనా మిత్రమండలి’ పేర్కొంది. ఆసియా ఖండంలో సుస్థిరత, శాం తి స్థాపనకు భారత్-చైనా మైత్రి అత్యవసరమని స్పష్టం చేసింది. ‘భారత్-చైనా మిత్రమండలి’ జాతీయ మహాసభలు శనివారం బాగ్లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, మైత్రి పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ మండలి అధ్యక్షుడు, గాంధేయవాది పండిట్ సుందర్లాల్, కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు తారాచంద్ అధ్యక్షతన సమావేశం జరిగిం ది. బీజింగ్కు చెందిన సీసీఏఎఫ్ఎఫ్సీ డిప్యూటీ జనరల్ ట్యాంగ్ రుమిన్, డిప్యూటీ డెరైక్టర్ లియా హాంగ్మిన్లు మాట్లాడుతూ... ‘భౌగోళికంగా అతిపెద్ద దేశాలైన భారత్, చైనాలు ప్రపంచ జనాభాలోనూ అత్యధిక శాతం (దాదాపు 270 కోట్లు) కలిగి ఉన్నాయి. సోషలిస్టు సమాజ నిర్మాణ మార్గంలో చైనా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
భారత్ వంటి గొప్ప దేశంతో స్నేహ హస్తం అందుకోవడాన్ని స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆ దేశంలో వ్యవసాయానికి అంతటి ప్రాధాన్యమిస్తున్నారనే విషయాలను మన పాలకులు, ప్రజలు గుర్తించాలి’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ చెప్పారు. నేపాల్- చైనా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్పాండే మాట్లాడుతూ, ‘ఇరుదేశాల మధ్య అల్లర్లు సృష్టించి వైరం పెంచే ప్రయత్నం చేస్తున్నవారిని పక్కన పెట్టి అభివృద్ధి వైపు పరుగెడదాం. భారత్-చైనా-నేపాల్ మధ్య 200 కిలోమీటర్ల బ్రిడ్జితో సరిహద్దులు సరిచేసి స్నేహపూర్వకంగా ఉందాం’ అని సూచించారు. ‘భారత్, చైనా మధ్య స్నేహ, ఆర్థిక ఒప్పందం ఎంతో అవసరం. దేశభక్తి అంటే ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమే కానీ అల్లర్లు సృష్టించడం కాదు’ అని ఐసీఎఫ్ఐ అధ్యక్షుడు చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. ఏఎస్సీఐ జనరల్ డెరైక్టర్ రవికాంత్, మాజీ ఎంపీ, ఐసీఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోలిపేట రాంచంద్రారెడ్డి, జాతీయ అధ్యక్షుడు జి.ఎస్.నాగరాజు, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధాలతో ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు
Published Sun, Mar 13 2016 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement