సాక్షి, హైదరాబాద్: నేరస్తులకు పడే శిక్షా శాతం పెరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు, దర్యాప్తు అధికారులు కృషి చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. దేశవ్యాప్తంగా కన్విక్షన్ రేటు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో శిక్షా శాతం పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన అంశాలపై హైదరాబాద్ కూకట్పల్లిలో జేఎన్టీయూ ఆడిటోరియంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. డీజీపీ మహేందర్రెడ్డి నేతృత్వంలో జరిగిన సదస్సుకు అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ సాక్షులకు పోలీస్ శాఖ, కోర్టులపై నమ్మకం కల్గించేలా పనిచేయాలన్నారు. సమాజం తరఫున బాధ్యత తీసుకుని నేరçస్తులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం దక్కేలా కృషి చేయాలని చెప్పారు.
దర్యాప్తు అధికారులు కేసుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, బాధిత కుటుంబాలకు కేసుల విచారణ, పురోగతిపై వివరాలందించాలన్నారు. అంకితభావంతో పనిచేసే కానిస్టేబుళ్లకు రివార్డుతో పాటు గుర్తింపు లభిస్తుందని వెల్లడించారు. నేరస్తులకు శిక్షపడేలా పనిచేసిన కోర్టు కానిస్టేబుళ్లను సంబంధిత అధికారులు అభినందించాలన్నారు. కేసుల విచారణలో డిఫెన్స్ను ఎదుర్కునేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. దీని ద్వారా నేరం చేసిన ప్రతీ వ్యక్తికి శిక్షపడుతుందని ఆకాక్షించారు. కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీపీ గోవింద్, కమిషనర్లు అంజనీకుమార్, సజ్జన్నార్, డీవోపీ వైజయంతి, ఎస్పీలు, ఇతర కమిషనర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు.
శిక్షా శాతం పెరిగేలా పనిచేయాలి
Published Sun, Jun 24 2018 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
Advertisement