ఐదుగురు ఐఏఎస్లు, ఐపీఎస్ అనురాధపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఏస్ అధికారి, అదనపు డీజీ అనురాధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి భాస్క ర్ కుల్బేకు లేఖ రాశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సిద్ధార్థ జైన్ను తెలంగాణకు కేటాయించగా ఏపీ ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమని,ఆంధ్రాలోనే కొనసాగించాలని సీఎస్ లేఖలో వివరించారు.
అలాగే సీఎం ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ సహానీని తెలంగాణకు కేటాయించారు. అజయ్నూ ఏపీలోని కొనసాగించాలని సీఎస్ ఆ లేఖలో కోరారు. మదనపల్లి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆర్.వి. కర్ణన్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్జైన్, ఏపీ.భవన్లో రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఏకే సింఘాల్ను ఐఏఎస్ల పంపిణీలో తెలంగాణకు కేటాయించారు. వారి సేవలు ఆంధ్రప్రదేశ్కు అవసరముందని, ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు ఐఏఎస్లను రిలీవ్ చేయబోమని, ఇందుకు అనుమతించాల్సిందిగా సీఎస్ రాసిన లేఖలో కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తున్న అనురాధను ఐపీఎస్ల పంపిణీలో తెలంగాణకు కేటాయించారు.అమె సేవలు ఏపీలోఅవసరం ఉన్నందున ఆమెను కూడా రిలీవ్ చేయబోమని, ఇందుకు అనుమతించాలని సీఎస్ లేఖలో కోరారు. తెలంగాణకు కేటాయించిన 50 మంది ఐఏఎస్ అధికారులను ఈ నెల 2వ తేదీన కేబినెట్ భేటీ ముగిసేవరకూ రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా డిసెంబర్ నెలాఖరులోగా రిలీవ్ చేసినట్లైతే వేతనాలు సమస్య ఉండదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమైంది. మంత్రివర్గ సమావేశం వల్ల రిలీవ్ చేయడాన్ని వాయి దా వేశారు.
కొత్త పారిశ్రామిక విధానం...
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 2వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని అమోదించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా అత్యధిక రాయితీలతోపాటు విద్యుత్ రాయితీలతో కూడిన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నారు.అత్యధిక రాయితీలతో పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా విధానం ఉండనుందని తెలుస్తోంది.
ఆ ఆరుగురినీ రిలీవ్ చేయం
Published Thu, Jan 1 2015 2:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement