► కంపెనీ మారినానంబరు మారదు
►పీఎఫ్ ఖాతాలేకపోతే ఫిర్యాదులు చేయండి
►పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్కుమార్
పటాన్చెరు: ఇక నుంచి ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులందరికీ పర్మినెంట్గా ఒకే నంబర్ (యూనిక్)ను కేటాయిస్తున్నామని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గణేష్కుమార్ తెలిపారు. ఇక నుంచి ఖాతాదారులెవరూ కంపెనీలు మారినప్పుడల్లా కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదన్నారు. తమ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 1,88,327 మంది ఖాతాదారులందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను కేటాయించామన్నారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికీ పీఎఫ్ ఖాతా నంబర్ తెలియని వారు వెంటనే కంపెనీ యాజమాన్యాన్ని అడిగి నంబర్ తెలుకుకోవాలన్నారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల పీఎఫ్ నంబర్లను వారికి తెలపాలన్నారు. ఓ వ్యక్తి పేరు మీద పీఎఫ్ సొమ్ము నెలవారీగా అందితే అతనికి నిర్ణీత నంబర్ (పన్నెండకెల సంఖ్య)ను కేటాయించామని స్పష్టం చేశారు.
గతంలో కాకుండా పీఎఫ్ క్లెయిమ్లను కూడా త్వరితగతిన చేపడుతున్నామన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కటింగ్ చేసి సదరు ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో సొమ్ము జమచేయని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అసలు పీఎఫ్లు కట్టని సంస్థలు 300 ఉన్నట్లు గుర్తించామని, త్వరలోనే ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఖాతాదారులందరూ ఆధార్ ఇవ్వాల్సిందే
పీఎఫ్ ఖాతాదారులందరూ తమకు కేటాయించిన యూనిక్ నంబర్తో తమ ఆధార్ కార్డు నంబర్ను జత చేయాలన్నారు. అలాగే ఖాతాదారులందరూ తమ బ్యాంకు ఖాతాల అకౌంట్ నంబర్తో పాటు, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ సమర్పించాలన్నారు. ఖాతాదారులందరూ తమ సంస్థల ద్వారానే వివరాలను పీఎఫ్ కార్యాలయానికి పంపాలన్నారు. ఇక నుంచి క్లెయిమ్ పరిష్కారం తర్వాత పీఎఫ్ మొత్తం నేరుగా ఖాతాదారుడి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తామన్నారు.
ఫిర్యాదు చేయండి
పీఎఫ్ సమస్యలపై ఎవరైనా సరే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ గ ణేష్కుమార్ సూచించారు. కాంట్రాక్టర్ చేసే మోసాలు, లేదా యా జమాన్యం చేస్తున్న మోసాలపై ఎప్పటికప్పుడు తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఉద్యోగుల పేరిట పీఎఫ్ ఖాతా తెరవని సంస్థలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదు చేసిన వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులెవరైనా టటౌ.ఞ్చ్ట్ట్చఛిజ్ఛిటఠః ్ఛఞజజీఛీజ్చీ.జౌఠి.జీ కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు. అలాగే ప్రతి నెల 10వ తేదీన భవిష్యనిధి అదాలత్లో కూడా ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
పీఎఫ్ పెన్షన్ రూ.1000
ఫీఎఫ్ ఖాతాదారులకు కనీసంగా రూ. వెయ్యి పింఛన్ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. 2014 ఏప్రిల్ నుంచి ఇది వర్తిస్తుందన్నారు. అయితే ఖాతాదారులకు పెరిగిన పింఛన్ ఇవ్వడం లేదన్నారు. అక్టోబర్ నెల నుంచి పెంచిన పింఛన్ ఇస్తామన్నారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం బకాయిలన్నింటినీ విడుదల చేస్తామన్నారు. ఖాతాదారుల పింఛన్ స్థాయిని బట్టి పింఛన్ పెరుగుతుందన్నారు. కానీ కనీస పింఛన్ మాత్రం రూ.వెయ్యి ఉంటుందన్నారు.
ఇక నుంచి ఒకే పీఎఫ్ నంబర్
Published Sat, Aug 23 2014 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement