వరంగల్, న్యూస్లైన్ : నోటికాడికొచ్చిన ధాన్యం నీటిపాలైంది. చేతికొచ్చిన పంటలు నేలపాలయ్యాయి. అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశారుు. వరుస వానలు వారిని నట్టేట ముంచారుు. అల్పపీడన ద్రోణితో జిల్లాలో శుక్రవారం కురిసిన అకాలవర్షంతో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి తోటలతో పాటు కూరగాయాల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఐకేపీ కేంద్రాలు, మార్కెట్ యార్డులకు అమ్మకానికి రైతులు తెచ్చిన 25 వేల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కొత్తగూడ మండలంలో ఆకస్మికంగా వచ్చిన సుడిగాలికి రామన్నగూడెం, లడాయిగడ్డ, ముస్మి, ముస్మీతండా గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది. 43 రేకుల ఇళ్లు, పూరిళ్ల కప్పులు లేచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 11 వేల హెక్టార్ల పరిధి లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. వ్యవసాయ శాఖ అధికారులు ఎన్నికల విధుల్లో భాగంగా శిక్షణలో ఉన్నందున పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేయలేకపోయారు.
చేలల్లోనే నేలరాలిన పంటలు
చేతికొచ్చిన పంటలు చేలల్లోనే నాశనమయ్యాయి. 11 వేల హెక్టార్ల పరిధిలో వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తిలో నాలు గు వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న దెబ్బతింది. పరకాల సెగ్మంట్లోని పరకాల, గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న గొర్రెకుంట, స్తంభంపల్లి, ధర్మారం, పోతరాజుపల్లి ప్రాంతాల్లో ఆకాల వర్షంతో వెరుు్య ఎకరాల్లో కోతకు వచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లింది. ములుగు నియోజకవర్గ పరిధిలోని గోవిందరావుపేట, వెంకటాపూర్, మం గపేట, కొత్తగూడ మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.
నర్సం పేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట, దుగ్గొండి, ఖానాపూర్, నల్లబెల్లి మండలాల్లో కోతకొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నీటిపాలయ్యూరుు. సుమారు 4,500 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. జనగామ నియోజకవర్గం లోని జనగామ, చేర్యాల, బచ్చన్నపేట ప్రాం తంలో 2,500 ఎకరాల్లో ధాన్యం కోతకు రాగా... మొదళ్లు తడిసి గింజలు రాలిపోయా యి. మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు మండలాల్లో 4,300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. డోర్నకల్ నియోజకవర్గంలోని కురవి, మరిపెడ, నర్సింహులపేటలో 800 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని జఫర్గఢ్, ధర్మసాగర్, రఘునాథపల్లి, లింగాలఘన్పూర్లో 500 ఎకరాల విస్తీర్ణంలో పంట లు దెబ్బతిన్నాయి. రెండు వేల హెక్టార్లలో కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కూరగాయలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.
టార్పాలిన్ లేక తల్లడిల్లిన రైతులు
తొర్రూరు, పాలకుర్తి, రాయపర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, చెన్నారావుపేట, దుగ్గొండి, బచ్చన్నపేట, జనగామ, మహబూబాబాద్, కురవి, కేసముద్రం, నెల్లికుదురు, నర్సింహులపేట, నల్లబెల్లి మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక 10వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. నర్సంపేట, జనగామ, పరకాల, వరంగల్, కేసముద్రం, మార్కెట్లలో 15వేల బస్తాల ధాన్యం, మిర్చి నీటిపాలైంది. పరకాల మార్కెట్లో వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్రైస్ కోసం కొనుగోలు చేస్తామని జిల్లా ఐకేపీ మార్కెటింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ కరుణాకర్రావు తెలిపారు.
ముంచిన వర్షం
Published Sat, May 10 2014 3:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్
ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే: సీఎం జగన్
భార్యాభర్తలిద్దరూ స్టార్ క్రికెటర్లే.. అతడు కాస్ట్లీ.. ఆమె కెప్టెన్!(ఫొటోలు)
టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు.. తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
నాకు జాబ్ ఇవ్వండి.. నేనే రూ.40 వేలిస్తా!
రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement