వాన నీటి సంరక్షణపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సదస్సు
రైతులకు అవగాహన కల్పించిన నిపుణులు
రంగారెడ్డి జిల్లా: పొలంలో నీటి నిల్వతోపాటు భూగర్భ జలాల భారీగా పెంపొందించే అంశంపై ‘సాక్షి’ మీడియా గ్రూప్, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం సంయుక్తంగా తలపెట్టిన రైతు సదస్సుకు విశేష స్పందన లభించింది. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గ కేంద్రాల్లో వేర్వేరుగా నిర్వహించిన రైతు సదస్సులు రైతుల్లో సరికొత్త ఆలోచనలు నింపింది. ‘చేను కిందే చెరువు’ అనే నినాదంతో తలపెట్టిన ఈ కార్యక్రమం.. వర్షపునీటిని సద్వినియోగం చేసుకుంటూ నీటి ఎద్దడిని ఎదుర్కొనగలమనే ధీమాను నింపింది. ప్రస్తుతం భూగర్భ జలాలు భారీగా పతనమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి సాగును మరింత లాభదాయకం చేసేందుకు ‘సాక్షి’ మీడియా గ్రూపు రైతు అవగాహన సదస్సులకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డిలు పాలుపంచుకున్నారు.
నా పొలం నుంచే శ్రీకారం: మంచిరెడ్డి
ఇబ్రహీంపట్నంలో బాలాజీ గార్డెన్లో నిర్వహించిన రైతు సదస్సుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందకాల ఆలోచన అభినందనీయమని చెప్పారు. ముందుగా తన పొలంలో కందకాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.
కందకాలతో కొత్త మలుపు..
పొలంలోనే భూమి పైభాగం నుంచి నిర్ణీత లోతు వరకు కందకాలు తవ్వుకోవాల్సి ఉంటుంది. తద్వారా వర్షపు నీరు ఈ కందకాల్లో నిల్వ అవుతాయి. ఫలితంగా పొలంలోనే భూగర్భ జలాల మట్టం పెరుగు తుంది. ఇందుకు రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం నుంచి నిపుణులు రైతు పొలం వరకు వచ్చి సలహాలు ఇవ్వనున్నట్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్రెడ్డిలు ప్రకటించారు.
చేను కిందే చెరువు!
Published Tue, May 19 2015 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement