ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరేకాదు..
మధ్యాహ్న భోజనం తదితర పథకాలన్నింటికీ వర్తింపు
ఆధార్తోనూ అనుసంధానం, నిర్వహణకు ప్రత్యేక సర్వర్ చర్యలు చేపడుతున్న విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారీ హాజరు కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన విద్యాశాఖ.. తాజాగా అన్ని విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫారాలు, పాఠ్య పుస్తకాలు, రవాణా సదుపాయం వంటి ప్రయోజనాలకు కూడా బయోమెట్రిక్ను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనిని ఆధార్తోనూ అనుసంధానం చేసి తప్పుడు సమాచారానికి ఆస్కారం లేకుండా, విద్యా ప్రయోజనాలు దుర్వినియోగం కాకుండా చూడాలని భావిస్తోంది. వీటితోపాటు అకడమిక్ అంశాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వంటి అన్నింటిలోనూ బయోమెట్రిక్ హాజరు, ఆధార్ అనుసంధానంతో పక్కాగా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం విద్యాశాఖ ప్రత్యేక సర్వర్ను ఏర్పాటు చేసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీ(ఏయూఏ) కింద తమకు ఇవ్వాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు విద్యాశాఖ లేఖ రాసింది.
ఇప్పటికే పూర్తయిన 60 శాతం ఆధార్
రాష్ట్రంలో ఇప్పటికే 60 శాతానికిపైగా విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని సేకరించిన విద్యాశాఖ.. రెండు నెలల్లో మిగతా విద్యార్థుల ఆధార్ సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 61 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికే 40 లక్షల మందికిపైగా విద్యార్థుల ఆధార్ పూర్తయింది. ఆధార్ నెంబరు లేని వారు తీసుకునేలా చర్యలు చేపట్టాలని అన్ని పాఠశాలల అధికారులు, యాజమాన్యాలను ఆదేశించింది. రాష్ట్రంలో 25,561 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో మొదట 6,391 పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేలా చర్యలు చేపట్టింది. మిగతా 19,170 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఎంత మంది విద్యార్థులకు అందాయన్నది స్పష్టంగా తెలియనుంది. విద్యార్థుల వయసు పెరిగే కొద్దీ వేలిముద్రలు మారే అవకాశం ఉన్నందునా బయోమెట్రిక్ డాటాను ఐదేళ్లకోసారి అప్డేట్ చేస్తామని విద్యాశాఖ తెలిపింది.
విద్యా కార్యక్రమాలు అన్నింటిలోనూ బయోమెట్రిక్
Published Sat, Aug 20 2016 2:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement