- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న
- జర్నలిస్టులకు అండగా నిలుస్తానని హామీ
టేకులపల్లి : ఎన్నికల్లో గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికారని, ముఖ్యమంత్రి అయ్యూక ప్రజా సంక్షేమమే మరిచిపోయూరని ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పటభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విమర్శించారు. తన కుటుంబ సభ్యుల సౌఖ్యమే చూసుకుంటున్నారని అన్నారు.
శనివారం రాత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య దళ్సింగ్ నాయక్ ఆధ్వర్యంలో గుండా నరసింహారావు నివాసంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటని ఆరోపించారు.
టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు తెలంగాణ ఉద్యమం ముసుగులో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తనపై పోటీకి వస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల ఫీజులను మాయం చేసిన టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే పట్టభద్రుల భవిష్యత్తు ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. చట్టసభలో సామాన్యులు, ఉద్యమ చరిత్ర కలిగిన వారు ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడంవల్లే రాష్ట్రంలో కేసీఆర్ ఆగడాలు సాగుతున్నాయని అన్నారు.
మండలిలో ప్రజాసంక్షేమంపై పాలకపక్షాన్ని నిలదీసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. అర్హతలు ఉన్నా పోలీసులు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇస్లావత్ పార్వతి, ఎంపీటీసీలు గుగులోత్ సత్యవతి, జబ్బ విజయలక్ష్మీ, నాయకులు శేషురాంనాయక్, రెడ్యానాయ్, మున్నుస్వామి, సక్రు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీఎం గారూ... ఇంటికో ఉద్యోగమేది...?
Published Sun, Mar 15 2015 2:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రచార హోరు
అన్ని కేంద్రాల్లో వెబ్క్యాస్టింగ్ ఉండాలి
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement