గర్భిణులు.. బాలింతలు.. శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు ఉద్దేశించిన కోడిగుడ్ల సరఫరా జిల్లాలో పక్కదారి పట్టింది. సిండి‘కేట్లు’గా మారి కాంట్రాక్టులు దక్కించుకున్నవారు సొంత లాభమే చూసుకుంటున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) అమలవుతున్న 18 ప్రాజెక్టుల్లో గుడ్ల సరఫరా ప్రహసనంగా మారింది...!!
సాక్షిప్రతినిధి, నల్లగొండ :స్త్రీ, శిశు సంక్షేమశాఖ స్త్రీలు, శిశువులకు ఎంత మేలుచేస్తుందో చెప్పలేం కానీ, ఈ శాఖను, ఈ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాలను నమ్ముకుని మాత్రం పదులసంఖ్యలో కాంట్రాక్టర్లు, కొందరు ఉద్యోగులు లబ్ధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో పథకాలు అమలయ్యే అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకుల నుంచి మొదలుపెడితే.. జిల్లాలో పైస్థాయిలో ఉన్న ప్రాజెక్టు డెరైక్టర్ కార్యాలయం వరకు పిల్లల నోళ్లు కొడుతూ వెనకేసుకుంటున్న వారే అధికం. జిల్లావ్యాప్తంగా ఉన్న 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న ఐదు ఏజెన్సీల పనితీరుపై పలుఆరోపణలు ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఆ ఐదు ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుడ్ల సరఫరాలో నిబంధనలు పాటించడం లేదని, నిర్ణీత సైజు, బరువుతో కూడిన గుడ్లు కాకుండా చిన్నసైజు గుడ్లు సరఫరా చేయడం, నెలలో 30 రోజులు కాకుండా, మధ్యలో అప్పుడప్పుడు కొన్ని రోజులు ఎగ్గొట్టడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెన్సీలకే నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు దాకా గడువున్న ఏజెన్సీల కాంట్రాక్టులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆ నోటీసుల్లో ఆదేశించారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టులు (18), ఇందిరమ్మ అమృత హస్తం అమలవుతున్న 6 ప్రాజెక్టులు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా గుర్తించిన 17 మండలాల పరిధిలోని స్కూలు పిల్లలకు వెరసి 1.50 లక్షల మంది లబ్ధిదారులకు రోజూ 1.50 లక్షల కోడిగుడ్లు సరఫరా కావాలి. దీనికోసం కాంట్రాక్టు దక్కించుకున్న దేవీ ట్రేడర్స్, నైసా ట్రేడర్స్, శాంభవి ట్రేడర్స్, న్యూవెల్కమ్ ట్రేడర్స్, భూపతి ఎంటర్ ప్రైజెస్ అనే ఐదు ఏజెన్సీల పనితీరుపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ స్పందించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే గుడ్డు కనీసం 50 గ్రాముల బరువు ఉండాలి. ఈ సైజులో ఉన్న గుడ్లనే సరఫరా చేయాలి. కానీ, కాంట్రాక్టర్లు తమ మిగులుబాటు కోసం కేవలం 30 గ్రాముల బరువున్న గుడ్లను అందిస్తున్నారు.
కోళ్లు పెట్టే తొలిగుడ్లు కేవలం 30 గ్రాముల బరువే ఉంటాయని, వీటి ధర కేవలం రూ.1.50 కావడంతో కాంట్రాక్టర్లు వీటినే సేకరించి సరఫరా చేసి సొమ్ములు మిగిలించుకుంటున్నారు. 50 గ్రాములు ఉన్న కోడిగుడ్డు ధర రూ. 3.50 ఉండడంతో ఈ రూపంలోనే వారికి ఒక్కోగుడ్డుపై ఏకంగా రూ.2 మిగులుతోంది. ఇది కాకుండా, మధ్యమధ్య అసలు గుడ్లే సరఫరా చేయడం లేదు. కాగా, ఇదే ప్రాజెక్టుల్లో కొన్నింటికి మహిళా సంఘాలు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నాయి. వీరు సరఫరా చేస్తున్న గుడ్లు 50 గ్రాముల నుంచి 60 గ్రాముల బరువు ఉంటున్నాయని చెబుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్ అటు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న సరఫరాను, కాంట్రాక్టర్ల పనితీరును బేరీజు వేసి షోకాజు నోటీసులు ఇచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి, అధికారులపై ఒత్తిడి పెట్టి కాంట్రాక్టులు సంపాదించిన కొందరు కాంట్రాక్టర్ల పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. ఉన్నతాధికారులు మరింతగా దృష్టి సారిస్తే, కాంట్రాక్టర్ల చేతివాటం మరింతగా బయటపడే అవకాశాలు ఉన్నాయి.
కోడిగుడ్లా...గోలీ కాయలా!
Published Tue, Sep 2 2014 3:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement