సాక్షి, జనగామ: సాధారణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. డిసెంబర్ ఏడున జరుగనున్న పోలింగ్కు అన్ని రాజ కీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓట్ల కోసం ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా కార్యక్రమాలతో ప్రచారం తారస్థాయికి చేరుకుంది. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో హోరాహోరీ ప్రచారంతో అభ్యర్థులు పొలిటికల్ హీట్ పెంచారు.
ప్రచారానికి మరో 48 గంటలే..
డిసెంబర్ ఏడున జరుగనున్న పోలింగ్కు ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థులకు కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈనెల ఐదో తేదీన సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి గడువు ఉంది. అభ్యర్థులకు మంగళ, బుధవారం రెండు రోజులు మాత్రమే ఓటర్లను కలుసుకునే అవకాశం ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారంతోపాటు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిం చుకోవడానికి కూడా అంతే సమయం ఉంది. దీంతో మూడు నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
పదునెక్కిన ప్రచారం..
ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మి గిలి ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నవంబర్ 19వ తేదీన పాలకుర్తి, 23న జనగామ, 26న స్టేషన్ఘన్పూర్లో జరిగిన ప్రజా ఆశీర్వద బహిరంగసభల్లో పాల్గొని ప్రచారం చేశారు. పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల్లో ఆపద్ధర్మ భారీనీటిపారుదల శాఖమంత్రి హరీష్రావు ప్రచారం నిర్వహించారు. పాలకుర్తిలో గాయని మధుప్రియ ఎర్రబెల్లి తరఫున ప్రచారం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల ప్రచార సరళితో పాటు పార్టీ కార్యక్రమాలను ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్వహిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం ఒంటి చేత్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు కవర్ అయ్యేలా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
తుది ప్రచారానికి అగ్రనేతలు..
మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో జిల్లాకు అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ తరఫున కేటీఆర్, హరీష్రావు ప్రచారంచేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి రోడ్షోలు చేపట్టి ఓటర్లను కలవడం కోసం టూర్ షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. అగ్రనాయకుల ప్రచార కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొననుంది.
జనగామ: తుది ప్రచారానికి 48 గంటలే..
Published Mon, Dec 3 2018 10:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు జగన్వైపే
మండే ఎండలు X మధుమేహం!
అమ్మ ఆదర్శ కమిటీలు నామమాత్రమేనా?
కామారెడ్డిలో దొంగల అలజడి
హై ఓల్టేజీతో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం
వడదెబ్బతో గుర్తు తెలియని వ్యక్తి మృతి
సేల్స్టాక్స్ అధికారులమని బెదిరింపులు
ఓటు వజ్రాయుధం వంటిది
జనసభకు ఏర్పాట్లు పూర్తి
ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలి
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement