అధికార యంత్రాంగం ఇప్పుడు మండల, జిల్లా పరిషత్లకు కార్యవర్గాల ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలను విడుదల చేయడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘స్థానిక’ సమరంలో వివిధ రాజకీయ పక్షాల తరఫున ఎన్నికైన వారు చైర్మన్లను, కో-ఆప్టడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు.
జెడ్పీసెంటర్, న్యూస్లైన్: మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల ఎన్నికల నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో మండల పరిసత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, కో- ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన పలు నిబంధనలను జారీ చేసింది. సంబంధిత ఉత్తర్వుల కాపీ సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరింది. పాలక వర్గాల ఏర్పాటుకు సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
నిబందనలివి...
పంచాయతీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 149(1)(వీ) ప్రకారం ప్రతీ మండలానికి ఒక మైనారిటీని కోఆప్షన్ సభ్యుడిగా ఎన్నుకోవాలి. అతను సంబంధిత మండలంలో ఓటరై ఉండాలి. 21 ఏళ్లు నిండిన వారు అర్హులు.
సెక్షన్ 153(1) ప్రకారం ప్రతీ మండలంలో ఒక అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని సభ్యులు చేతులెత్తి ఎన్నుకోవాలి. గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్మేరకు వారిని సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ విప్ను దిక్కరిస్తే ఆయన సభ్యత్వాన్ని సీజ్ చేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది.
సెక్షన్ 177 (3)(వీ) ప్రకారం జిల్లా పరిషత్కు ఇద్దరు మైనార్టీలను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవచ్చు. 21 ఏళ్లు నిండి, జిల్లాలో ఓటు హక్కు ఉన్నవారు ఇందుకు అర్హులు.
సెక్షన్ 181(1) ప్రకారం జెడ్పీ చైర్మన్ను సభ్యులు చేతులెత్తి ఎన్నుకోవాలి. ఇక్కడ కూడా గుర్తింపు పొందిన పార్టీలు జారీ చేసిన విప్ మేరకు ఆయా పార్టీల సభ్యులు నడుచుకోవాల్సి ఉంటుంది. విప్ను ధిక్కరిస్తే జెడ్పీటీసీ సభ్యత్వాన్ని సీజ్ చేసే అధికారం ఆయా పార్టీలకు ఉంటుంది.
మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సభ్యులు, కోఆప్షన్సభ్యులు మాత్రమే అర్హులు
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్థానిక సంస్థల్లో ఓటు హక్కులేదు. వారు ఆయా సంస్థల్లో జరిగే సమావేశాలకు హాజరైతే కూర్చొనేందుకు ప్రత్యేక స్థానాలను మాత్రమే కేటాయించాలి.
సమావేశ భవనంలో ఎలాంటి ప్రచారాలకు అనుమతి ఇవ్వరాదు. అలాగే సభ్యులపై ప్రలోభాలు జరగకుండా చూసుకోవాలి.
ఏవైనా కారణాల వల్ల కోఆప్షన్ సభ్యు ల ఎంపిక జరక్కపోతే ఆ సమాచారాన్ని వెంటనే ఎస్ఈసీకి తెలియజేయాలి.
ఈ ఎన్నికలకు సబంధించిన ప్రత్యేక సమావేశాల్లో తప్పనిసరిగా కోరం ఉండాలి.దీనికోసం గంటసేపు నిరీక్షించవచ్చు. అప్పటికి కోరం లేకపోతే మరుసటి రోజుకు సమావేశాన్ని వాయిదా వేయాలి. ఆ రోజు కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోతే విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తేవాలి.
‘పరిషత్’ ..షరతులివే..!
Published Thu, May 29 2014 2:38 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement