- ఎలక్ట్రానిక్ త్రాసులతో వ్యాపారుల మోసం
- దుకాణాల్లో, వ్యవసాయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి
- నిమ్మకునీరెత్తిన తూనికలు, కొలతల శాఖ అధికారులు
పరిగి: పట్టణంలోని కొందరు వ్యాపారులు హైటె(క్ని)క్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలతో వినియోగదారులను నట్టేటా ముంచుతున్నారు. వ్యాపారులు ప్రస్తుతం తూనికలు, కొలతల శాఖ అధికారుల అదేశాలతో దుకాణాలు, అడ్తీల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడు ఎలక్ట్రానిక్ కాంటాలను చూడగానే కొండంత భరోసాతో గండెమీద చేయి వేసుకుని కొనుగోళ్లు జరుపుతుంటాడు.
కారణం.. యంత్రాలు మోసం చేయవని. కాని కొందరు వ్యాపారులు నిపుణులైన వారితో యంత్రాలకు ఉన్న స్క్రూలను తిప్పి సెట్టింగ్ మార్చి వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల కొందరు వినియోగదారులు తాము కొనుగోలు చేసిన కేక్లు, స్వీట్లు, స్టీల్ పరిమాణం తక్కువగా ఉందని అనుమానించి మరో చోట తూకాలు వేయించగా మోసపోయినట్లు తేలింది.
భారీ స్థాయిలో మోసం...
కొందరు స్టీల్ వ్యాపారులు భారీ మోసానికి పాల్పడుతున్నారని పలువురు పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. వినియోగదారులు దాదాపు 20 శాతానికి పైగా మోసపోతున్నారని చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు నిలువుగా దగాకు గురవుతున్నారు. పత్తి, కందులు, పెసలు, వేరుశనగ తదితరాలు కొనుగోలు చేసే వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం చేస్తున్నార నే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిగిలోని కూరగాయల మార్కెట్లో ఇప్పటికీ తూకాలకు బండరాళ్లనే వినియోగిస్తున్నారు.
వెలుగుచూసిన మోసాలు ఇవి..
పరిగి పట్టణంలో ఇటీవల తూనికలు, కొలతల శాఖ అధికారులు జరిపిన తనిఖీల్లో భయానక మోసాలు వెలుగుచూశాయి. ఓ స్టీల్, సిమెంట్ దుకాణాల్లో తూనికల్లో తీవ్రస్థాయిలో అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు గుర్తించారు. ఓ దుకాణంలో పత్తి తదితర రైతు ఉత్పత్తులకు క్వింటాలుకు 3-5 కిలోలు తనకు ఎక్కువగా వచ్చేలా వ్యాపారి ఎలక్ట్రానిక్ కాంటాను సెట్ చేసుకున్నట్లు బయటపడింది. మరో స్టీల్ అండ్ సిమెంట్ ట్రేడర్స్లో 15-20 శాతం స్టీల్ వినియోగదారులకు తక్కువగా ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నాలుగు బేకరీలపై దాడులు నిర్వహించి వినియోగదారులు మోసపోతున్నట్లు గుర్తించారు. ఓ బేకరీలో 2 కిలోల కేక్ కొనుగోలు చేయగా 950 గ్రాముల బరువు తక్కువగా ఉంది. మరో బేకరీలో 2 కిలోలకు 500 గ్రాములు తక్కువ వచ్చేలా ఎలక్ట్రానిక్ కాంటాలో సెట్టింగ్ ఉంది. ఈవిషయాలు తూనికలు, కొలతల విభాగం ఇన్స్పెక్టర్ ప్ర భాకర్రెడ్డి వెల్లడించారు. దీనిని బట్టి పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు.
పట్టించుకోని అధికారులు..
తూనికలు, కొలతల శాఖ అధికారుల మొద్దు నిద్రతోనే వ్యాపారులు దర్జాగా వినియోగదారులను మోసం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎప్పుడో ఆరు నెలలకోసారి తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాట.. అన్న విధంగా తయారైంది. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, ఈనేపథ్యంలోనే పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొనాల్సిన అవసరం ఉంది.
‘కాంటా’ తంటాలు
Published Tue, Jun 17 2014 12:05 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
శ్యామలపై తప్పుడు కథనాలు.. చట్టపరంగానే ముందుకెళ్తానన్న యాంకర్!
స్టార్క్ సూపర్ డెలివరీ.. హెడ్కు ఫ్యూజ్లు ఔట్
భారీగా పెరిగిన ఫ్లిప్కార్ట్ గ్రోసరీ బిజినెస్
లిక్కర్ కేసు: మనీష్ సిసోడియాకు మళ్లీ చుక్కెదురు
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ట్వీట్..
బిగ్బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
Tirupati Gangamma Jatara 2024: తిరుపతిలో ఘనంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర (ఫొటోలు)
క్యార్వ్యాన్లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్
ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ కామెంట్
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement