- యాభై శాతం పెరిగిన టీఏ
- ఒకేరోజు ఏడు పీఆర్సీ జీవోల జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న జీవోలు శనివారం వెలువడ్డాయి. పదో పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ఉద్యోగులకు చెల్లించే కొత్త అలవెన్సుల వివరాలతో ఆర్థిక శాఖ ఒకేరోజున ఏడు జీవోలను జారీచేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల ప్రయాణాలకు చెల్లించే దినసరి భత్యం యాభై శాతం పెరిగింది. రాష్ట్రంలో చేసే పర్యటనలకు సంబంధించి రూ.49,870-రూ.1,00,770 ఆపైన పేస్కేలు ఉన్న ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం దినసరి భత్యాన్ని రూ.450కి పెంచారు. రాష్ట్రం దాటి వెళ్లే పర్యటనలకు రూ.600కు పెంచారు.
గ్రేడ్ 2లో రూ.28,940-రూ.78,910, రూ.46,060 నుంచి రూ.98,440 మధ్య ఉన్న ఉద్యోగులకు రాష్ట్రంలో పర్యటనలకు ఇచ్చే దినసరి భత్యాన్ని రూ.200, రాష్ట్రం దాటి వెళితే రూ.450 చొప్పున చెల్లిస్తారు. గ్రేడ్-3 మిగతా ఉద్యోగులందరికీ రాష్ట్రంలో పర్యటనలకు రూ.225, రాష్ట్రం దాటి వెళితే రూ.300 చెల్లిస్తారు. సబ్ జైలు విధులకు హాజరయ్యే అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు ఇచ్చే జైలు అలవెన్స్ను రూ.300కు పెంచారు. హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్లకు ఇచ్చే ఇన్సెంటివ్ అలవెన్స్, ఉపాధ్యాయులకు ఇచ్చే స్కౌట్స్ అలవెన్స్కు ప్రత్యేక జీవో జారీ చేశారు.
గ్రేహౌండ్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, సిబ్బందికి ఇచ్చే స్పెషల్ అలవెన్స్లతో మరో జీవో విడుదల చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు ఇచ్చే కబేళా అలవెన్స్ పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. టైప్రైటర్, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ లేనట్లయితే న్యాయ విభాగంలో పనిచేస్తున్న కాపీయర్లకు మిషన్ అలవెన్స్ మంజూరుకు వీలుగా ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో అంగవైకల్య ఉద్యోగులకు సంబంధించిన అలవెన్సు జీవో తప్ప మిగతావన్నీ విడుదలయ్యాయి. బకాయిల చెల్లింపు విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
ఉద్యోగులకు పెరిగిన అలవెన్స్
Published Sun, May 3 2015 4:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement