'ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు' | Sakshi
Sakshi News home page

'ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు'

Published Mon, Jun 1 2015 9:17 PM

'ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగలేదు' - Sakshi

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని ఎర్రబెల్లి తెలిపారు. టీడీపీ-బీజేపీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటు వేశారన్నారు.

 

అయితే తమ కోడ్ వ్యూహంలో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్యేలు నోటా పక్కన ఓ అప్రధాన్యత ఓటు వేశారని.. అవి చెల్లవనడం సరికాదని.. రేవంత్ రెడ్డిని కావాలనే ఇరికించారని ఎర్రబెల్లి మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement