- కేసీఆర్కు వ్యవసాయరంగంపై చిత్తశుద్ధి లేదు
- టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్రావు
- వడగండ్లతో దెబ్బతిన్న పంటల పరిశీలన
సిరికొండ : రాష్ట్రంలో రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఒంటెత్తు పోకడ పోతున్నారని, రైతుల బాధలను పట్టించుకోవడం లేదని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. వడగండ్ల వానలతో, కరువుతో రైతులు అల్లాడుతున్నా ఆయనకు ఏమాత్రం కనికరం లేదని ఆరోపించారు. మండలంలోని కొండూర్లో వడగండ్ల వర్షాలతో దెబ్బతిన్న పంటల ను ఎమ్మేల్యేలు సాయన్న, ప్రకాష్గౌడ్, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖరీఫ్లో కరెంట్ కోతలు. రబీలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరుుతే దెబ్బతిన్న పంటలకు ఎంత నష్ట పరిహారం చెల్లిస్తామనే విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేయలేదని విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. పంటల పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు చాయలు ఉన్నా.
కరువు మండలాలుగా ప్రకటించడం లేదన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం చెబుతున్నారని, రైతుల వద్ద డబ్బులుంటే మరి ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సర్వే నెంబర్ను యూనిట్గా తీసుకుని పంటల బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు వరికి ఎకరానికి రూ. 25 వేలు, వాణిజ్య పంటలకు రూ. 30 వేలు, మామిడి ఇతర తోటలకు రూ. 15 వేల చొప్పున పరిహరం చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే, టీడీపీ తరపున ఒక్కో కుటుంబానికి రూ. 50 వేల చొప్పున చెల్లించామని తెలిపారు. అకాల వానలతో పంటలు దెబ్బతిని పది రోజులు గడుస్తుంటే పంటల వివరాలు సేకరించాలని శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారని, పది రోజులుగా ఈ విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. పంటలు దెబ్బతిన్న రైతులు అధైర్యపడి బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. తాము రైతుల తరఫున పోరాడుతామని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారో వారం రోజుల్లోగా ప్రకటించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
రైతు బాధలు పట్టవా?
Published Sun, Apr 19 2015 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- జయహో జోయా
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
Advertisement