టెంపాస్ డాక్టర్లూ.. వెళ్లిపోండి: ఈటెల | Sakshi
Sakshi News home page

టెంపాస్ డాక్టర్లూ.. వెళ్లిపోండి: ఈటెల

Published Fri, Jan 23 2015 6:48 AM

టెంపాస్ డాక్టర్లూ.. వెళ్లిపోండి: ఈటెల - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, వైద్యుల పనితీరుపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లలో చాలామంది టైంపాస్ కోసం వచ్చి వెళుతున్నారే తప్ప.. విధులకు హాజరుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి డాక్టర్లు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేకుంటే వారి జాబితాను రూపొందించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురువారం కరీంనగర్‌కు వచ్చిన  ఈటెల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో  అధికారులతో సమావేశమై ‘స్వైన్‌ఫ్లూ’ నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement