- వినాయకుడి వీడ్కోలుకు అంతా సిద్ధం
- నాలుగు చోట్ల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు
- బందోబస్తులో 1,483 మంది పోలీసులు
- సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
- రెండురోజుల పాటు మద్యం అమ్మకాలు బంద్
నిజామాబాద్ క్రైం: పదకొండు రోజులపాటు భక్త జనుల నుంచి విశేష పూజలందుకున్న గణేశుడు సోమవారం నిమజ్జనానికి తరలనున్నాడు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసు లు భారీగా బలగాలను రంగంలోకి దించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను కనిపెట్టనున్నారు.
నిజామాబాద్ నగరం, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ పట్టణాలతోపాటు మండలాలు, గ్రామాలలో సోమవారం నిమజ్జన యాత్ర కొనసాగనుంది. కామారెడ్డిలో ఆదివా రం రాత్రే శోభాయాత్ర ప్రారంభమైంది. నగరంలో నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇ క్కడ 649 మంది పోలీసులను భద్రత కోసంనియమించగా, కామారెడ్డి, ఆర్మూర్ పట్టణాలతో పాటు నిమజ్జనం జరిగే వివిధ ప్రాంతాలలో 834 మందిని బందోబస్తు విధులకు కేటాయించారు.
జిల్లా కేంద్రంలో ప్రధాన ఊరేగింపు
జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతం నుంచి పగలు 1.30కు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. నిజామాబాద్ ఎంపీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ సుజాత జెండా ఊపి రథాన్ని ప్రారంభిస్తారు. గుర్బాబాది రోడ్డు, రైల్వే గేట్, గాంధీ గంజ్, ఒకటవ పట్టణ ఠాణా, గాంధీ చౌక్, నెహ్రూపార్కు, బోధన్ బస్టాండ్, అహమద్బజార్, గురుద్వార, పెద్దబజార్ వాటర్ ట్యాంక్, పెద్దబజార్ చౌరస్తా, ఆర్య సమాజ్, గోల్ హన్మాన్, పులాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్నగర్లోని గణపతుల బావి వరకు శోభాయాత్ర చేరుకుంటుంది.
నాలుగు చోట్ల నిమజ్జనం
జిల్లా కేంద్రంలో నెలకొల్పిన గణేశ్ విగ్రహాలను నాలుగు చోట్ల నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చిన్న, మధ్యతరహా గణపతులను వినాయక్నగర్ గణపతుల బావిలో నిమజ్జనం చే స్తారు. పెద్ద విగ్రహాలను నగర శివారులోని బోర్గాం (పి) వాగు లో నిమజ్జనం చేస్తారు. భారీ విగ్రహాలను ఎడపల్లి మండలం జాన్కకం పేట్ గ్రామ సమీపంలో అశోక్సాగర్, బాసర గోదావరి నదికి తరలిస్తారు.
మద్యం అమ్మకాలు బంద్
నిమజ్జనం సందర్భంగా జిల్లాలో సోమవారం మద్యం అమ్మకాలను నిషేధించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం కూడా మద్యం అమ్మకాలు ఉండవు. ఆరోజు జెండా బాలాజీ తీర్థయాత్ర ఉన్నందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నేడే శోభాయాత్ర
Published Mon, Sep 8 2014 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement