ప్రాణం తీసిన ఫేస్‌బుక్ సరదా | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ సరదా

Published Wed, Oct 15 2014 9:00 AM

ప్రాణం తీసిన ఫేస్‌బుక్ సరదా - Sakshi

చంచల్‌గూడ: జలకాలాడుతూ ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టాలనే ఉత్సాహంతో గుంతలోకి దిగిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పాతబస్తీలోని కుర్మగూడ డివిజన్ ఉప్పరిగూడకు చెందిన సురేందర్‌రెడ్డి తన మిత్రులు నాగేందర్, శివకుమార్, సంజయ్, ప్రణయ్, అమర్, నవీన్‌కుమార్‌లతో కలిసి సరదాగా గడిపేందుకు సోమవారం ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్ గ్రామ సమీపంలోని బోడబండ కుంటకు వెళ్లారు. ఫొటోలు దిగేందుకు గుంతలో దిగారు.

ఈత రాకపోవడంతో కె.సురేందర్‌రెడ్డి(21) నీటిలో మునిగిపోయాడు. దీంతో స్నేహితులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ యువకుడు మంగళవారం ఉదయం శవమై నీటిలో తేలాడు. ఎస్‌ఐ ఇఫ్తికార్ అహ్మద్ నేతృత్వంలో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు.

పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సురేందర్‌రెడ్డి తండ్రి తిరుపతి రెడ్డి ఓ చిన్న టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకు అర్థాంతరం గా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల శోకానికి అంతు లేదు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement