మిర్యాలగూడ : నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలకు మిర్యాలగూడ పట్టణం అడ్డాగా మారింది. పట్టణం సమీపంలోని దామరచర్ల, త్రిపురారం మండలాలకు చెందిన కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఈ దందా సాగిస్తున్నారు. అసలు భూమి లేకున్నా 10 వేల రూపాయలు ఇస్తే పట్టాదారు పాస్పుస్తకం అందజేస్తున్నారు. అచ్చం ఒరిజినల్ పుస్తకం మాదిరిగా ఉండడం వల్ల మిర్యాలగూడలోని బ్యాంకులలో పంట రుణాలు పొందుతున్నారు. ఈ తతంగం ఎన్నో సంవత్సరాలుగా సాగుతోంది. పోలీసులు, రెవెన్యూ అధికారుల విచారణలో గుట్టు బయటపడినా, పోలీసులు వారిని అరెస్టులు చేసినా ఈ నకిలీ పాస్పుస్తకాల జారీ ప్రక్రియ మాత్రం ఆగడం లేదు. మిర్యాలగూడలో ఈ నెల9వ తేదీన నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల ముఠాను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న వ్యక్తితో లింకు పెట్టుకున్న నకిలీ ముఠా సభ్యులు యథేచ్ఛగా పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. మిర్యాలగూడలో ఇల్లు అద్దెకు తీసుకొని నకిలీ పుస్తకాల వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారు. ముఠాలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే విషయంతోపాటు ఎవరెవరికి పాస్ పుస్తకాలు జారీ చేశారనే విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
గతంలో వెలుగు చూసిన అక్రమాలు
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్బీహెచ్ ఏడీబీలో దామరచర్ల, త్రిపురారం మండలాలకు చెందిన 26 మంది రైతులు నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలతో 18 లక్షల రూపాయల రుణాలు పొందారు. బ్యాంకు అధికారుల విచారణలో పాస్ పుస్తకాలు నకిలీవని తేలడంతో 2012 సెప్టెంబర్లో వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వేములపల్లి మండల కేంద్రంలోని ఎస్బీహెచ్లో దామరచర్ల, త్రిపురారం, పెద్దవూర మండలాలకు చెందిన 29 మంది రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో 2008లో 7.10 లక్షల రూపాయలు రుణాలు పొందారు. బ్యాంకు అధికారుల విచారణతో పాస్ పుస్తకాలు నకిలీవని తేలడంతో 2012 జూన్ మాసంలో వారిని వేములపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్బీహెచ్ ఏడీబీలో దామరచర్ల మండలంలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన 19 మంది రైతులు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందగా బ్యాంకు అధికారులు విచారించారు. అధికారులు నకిలీ పాస్పుస్తకాలుగా గుర్తించి 2011లో వారిని అరెస్టు చేశారు.
దామరచర్ల మండలంలోని కేశవపురానికి చెందిన 32 మంది, దిలావర్పూర్కు చెందిన 16 మంది మిర్యాలగూడ ఎస్బీహెచ్ ఏడీబీలో నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందారని 2010లో అధికారులు గుర్తించారు. కాగా విచారణ సాగుతోంది. దామరచర్ల మండలం వీర్లపాలెంలో 2012లో రెండు ఇళ్లలో రెవెన్యూ అధికారులు సోదాలు చేయగా 32 నకిలీ పాస్పుస్తకాలు లభించగా ఒకరిని అరెస్టు చేశారు.
ఫోర్జరీ సంతకాలతో జారీ..
నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలు జారీ చేస్తున్న ముఠా రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తోంది. ఆర్డీఓ, తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. సంతకాలతోపాటు ముద్రలు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. దామరచర్ల, త్రిపురారం, పెద్దవూర మండలాల్లో ఎక్కువగా అటవీ భూములు ఉండడం వల్ల సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. గతంలో ఒక్క దామరచర్ల మండలంలోని వంద ఎకరాల భూమికి నకిలీ పట్టాదారు పాస్పుస్తకాలతో జారీ చేసినట్లు సమాచారం. ఈ పుస్తకాలతో వివిధ బ్యాంకులలో కోట్ల రూపాయల రుణాలు పొందారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ వల్ల నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా పొందిన రుణాలు కూడా మాఫీ అయ్యాయి. అదే విధంగా ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తుండటం వల్ల ఇప్పుడు కూడా వివిధ బ్యాంకులలో నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందిన వారివి మాఫీ కానున్నాయి.
నకిలీ.. మకిలీ
Published Sat, Oct 25 2014 2:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement