రైతన్న బలవన్మరణం | Sakshi
Sakshi News home page

రైతన్న బలవన్మరణం

Published Tue, Apr 5 2016 5:12 PM

Farmer commits suicide

బషీరాబాద్ (రంగారెడ్డి జిల్లా) : బషీరాబాద్ మండలం దామరచేడ్ పంచాయతీ నంధ్యానాయక్ తండాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. అప్పులపాలైన రాథోడ్ ధన్‌సింగ్(40) అనే రైతు ఊరి చివరన ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధన్‌సింగ్‌కు సుమారు రూ.2 లక్షల అప్పు అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఆరుగురు ఆడపిల్లలు, ఓ కుమారుడు ఉన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కుటుంబసభ్యులు వాపోతున్నారు.

Advertisement
Advertisement