విద్యుధ్ఘాతానికి రైతు బలి | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతానికి రైతు బలి

Published Tue, Aug 4 2015 12:27 PM

farmer died due to current shock

బాల్కొండ(నిజామాబాద్): మోటర్ పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై ఓ రైతు మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వెల్కటూరు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూమానాయక్(60) తనకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల వరకు మాత్రమే కరెంట్ సరఫరా ఉండటంతో ఉదయాన్నే మోటర్ ఆన్ చేయడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement