కాలం కనికరించలేదు.. రెక్కలుముక్కలు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఈ ఏడాది సాగుచేసిన పత్తిపంట ఎండుముఖం పట్టింది. ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఈ విషాదకర సంఘటన షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లిలో సోమవారం చోటుచేసుకుంది.
షాబాద్ : మృతుడి కుటుంబీకులు, ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు అనుబంధ బండోనిగూడకు చెందిన కొత్తకుర్వ శంకరయ్య(50) ఇరవై సంవత్సరాల క్రితం కుటుంబంతో సహా షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామానికి వలస వచ్చాడు. ఇక్కడే స్థిరపడి 10 ఎకరాల భూమి కోనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతి ఏడూ పత్తిపంట సాగుచేస్తున్నాడు. మూడు సంవత్సరాలుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు సరిగా పండకపోవడంతో తీవ్ర నష్టం వచ్చింది.
అనంతరం వ్యవసాయ పెట్టుబడుల కోసం చేవెళ్లలోని యాక్సిస్ బ్యాంకులో రూ.6 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. ఈసారైనా కష్టపడి పంటలు సాగుచేసి ఎలాగైనా అప్పులు తీర్చాలని భావించాడు శంకరయ్య. గత జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు పది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటాడు. అప్పటి నుంచి వర్షాల జాడలేదు. దీంతో మొలకెత్తిన పత్తి మొలకలు ఎండుముఖం పట్టాయి. ఇక ఈ ఏడాది అప్పులే మిగిలేటట్టు ఉన్నాయని, గతంలోని అప్పులు కుప్పలుగా ఉన్నాయని మనోవేదనకు గురయ్యాడు. వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో గత జూన్ 28న పురుగుల మందు తాగాడు.
గమనించిన కుటుంబీకులు ఆయనను స్థానికుల సాయంతో నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దాదాపు వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన శంకరయ్య ఓడిపోయాడు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం తాళ్లపల్లిలో కుటుంబీకులు శంకరయ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య భాగ్యమ్మ, కూతుళ్లు మంజుల, అరుణ, కొడుకులు కుమార్, మల్లేష్లు ఉన్నారు. ఇద్దరి కూతుళ్ల వివాహం జరిగింది.
కన్నీటిపర్యంతమై కుటుంబీకులు
ఇంటికి పెద్దదిక్కు అయిన శంకరయ్య మృతితో భార్యాపిల్లలు కన్నీటిపర్యంతమయ్యారు. తామెలా బతకాలని గుండెలవిసేలా రోదించారు. అందిరితో కలుపుగోలుగా ఉండే శంకరయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
ఉసురు తీసిన అప్పులు
Published Mon, Jul 6 2015 12:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement