ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి

Published Fri, Apr 17 2015 6:39 PM

farmer dies of suicide attempt

మెదక్: అప్పుల బాధతో ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతు పరిస్థితి విషమించి శుక్రవారం చనిపోయాడు. ఎస్సై రాజేష్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన కొలుగూరి బాలయ్య(35) తనకున్న ఒకటిన్నర ఎకరాల భూమిలో సాగు కోసం బోరుబావి తవ్వించాడు. నీరు పడలేదు.


సాగు కోసం, కుటుంబ పోషణ నిమిత్తం ప్రైవేటుగా రూ.లక్ష అప్పు చేశాడు. పంట పండించలేక, రుణ భారం తీరేదారి కానరాక మనోవేదనకు గురై ఆదివారం సాయంత్రం పొలంలోనే పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు అతనిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం వేకువజామున మృతి చెందాడు. అతనికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
(శివ్వంపేట)

Advertisement
Advertisement