మరో యువరైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

మరో యువరైతు ఆత్మహత్య

Published Thu, Dec 3 2015 11:58 AM

farmer suicide in adilabad district

కుంటాల: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కుంటాల మండలం సరియాపూర్ పంచాయతి పరిధిలోని మెద్దన్‌పూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నితీష్(25) తనకున్న ఎకరం భూమితో పాటు ఆరెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నితీష్‌కు ఆరు నెలల క్రితమే వివాహమైంది. 
 

Advertisement
Advertisement