బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు

Published Mon, Sep 7 2015 4:00 PM

farmers held bankmanager in nizambad

నిజామాబాద్: పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పచ్చలనరుకుడు గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక డీజీబీ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. త్వరగా రుణాలు రెన్యూవల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు.

Advertisement
Advertisement