- ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉంటున్న గిరిజనేతరులు
- పహాణీలతో రుణాలిచ్చిన బ్యాంకులు
- గతంలో రుణమాఫీ పొందిన రైతులు
- రుణ మాఫీ అర్హత పత్రాలు ఎస్టీలకే ఇవ్వాలంటున్న కలెక్టర్
గోవిందరావుపేట : ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవిస్తున్న గిరిజనేతర రైతులకు అధికారులు మొండి చేరుు చూపనున్నారనే వార్తలు వారిలో కలకలం రేపుతోంది. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, కొత్తగూడ, వెంకటాపురం, మహబూబాబాద్, గూడూరు, నర్సంపేట, భూపాలపల్లి, ఖానాపురం, నల్లబెల్లి మండలాలు ఉన్నాయి. 13 మండలాల్లో ప్రతీ మండలంలోనూ గిరిజనేతర రైతులు దశాబ్దాల కాలంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.
గోవిందరావుపేట మండలంలో 5,510 మంది రైతులకు రుణమాఫీ అందాల్సి ఉందని అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో మండలంలో రుణ మాఫీ కావాల్సిన రూ.20 కోట్లలో దాదాపు రూ.5 కోట్లు ప్రస్తుతం బ్యాంకుల్లో రైతుల ఖాతాల్లోకి చేరాయి. అయితే వీరిలో మండలంలో ఉన్న గిరిజనేతర రైతులే 4 వేల మంది వరకు ఉంటారని అంచనా. ఏజెన్సీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజనేతరులకు పట్టాలు ఉండవు. దీంతో 50 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కూడా కేవలం పహాణీలే అందిస్తున్నారు. దీంతో బ్యాంకులు కూడా పహాణీల ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నాయి.
గత రెండేళ్లుగా గతంలో వచ్చిన పహాణీలను అధికారులు నిలిపివేయడం, రైతులకు నోటీసులు అందించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పహాణీలు రాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు కట్టి తీసుకునే రైతులు తగ్గిపోయారు. కాగా తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం మొదటి విడతగా 25 శాతం రుణమాఫీ డబ్బును బ్యాంకులకు అందించింది. ఈ పథకంలో లబ్ధిదారులకు తహసీల్దార్ల ద్వారా రుణమాఫీ అర్హత పత్రాలను రైతులకు అందించనున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో కేవలం గిరిజన రైతులకే వీటిని అందించాలని కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో కలెక్టర్ కిషన్ ఆదేశాలు జారీ చేయడంతో గిరిజనేర రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదే విషయమై కొత్తగూడ మండల కేంద్రంలో రైతులు ఇటీవల ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్లు కూడా తమ సిబ్బంది ద్వారా ముందుగా తమ వద్ద ఉన్న రుణాలు కలిగిన రైతుల్లో ఎస్టీలను గుర్తించే పనిలోపడ్డారు. వారికి రుణమాఫీ అర్హత పత్రాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో మిగతా గిరిజనేతర రైతులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. లేనట్లరుుతే రుణ భారంతో మళ్లీ రైతులు గడ్డుపరిస్థితిని ఎదుర్కోవడం తప్పేలా లేదు.
గిరిజనేతర రైతులకు రుణమాఫీ దక్కేనా?
Published Tue, Oct 21 2014 3:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement