Sakshi News home page

రుణమాఫీ కోసం రైతుల ఆందోళన

Published Wed, Oct 14 2015 1:45 PM

farmers protesting at bank in khammam district

ఖమ్మం : ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎస్బీహెచ్ బ్యాంకు ముందు బుధవారం రైతులు ధర్నాకు దిగారు. రుణాలను ఏకమొత్తంలో మాఫీ చేయాలని, పంటల సాగు కోసం తక్షణం రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాత్రమే తాము పని చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఇస్తే మాఫీ చేయడానికి తమకు అభ్యంతరం ఏమీలేదని బ్యాంకు అధికారులు రైతులకు తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement