నెట్వర్క్: సాగు కోసం చేసిన అప్పులు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. మహబూబ్నగర్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్లో ఒకరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లకు చెందిన రైతు మన్నె మాసిరెడ్డి(65) ఐదు ఎకరాలోల మొక్కజొన్న సాగు చేశాడు. దీని కోసం రూ. లక్ష అప్పు చేశాడు. దిగుబడి తగ్గడంతో అప్పు తీరే మార్గం కనిపించక బుధవారం గుళికలు మింగాడు. ఇదే జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన రైతు చిక్కొండ నారాయణ(55) నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు.
వ్యవసాయంతోపాటు, కూతురు పెళ్లి కోసం రూ. ఐదు లక్షల వరకు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి భారీగా తగ్గింది. అప్పులు తీరే మార్గం కనిపింకపోవడంతో క్రిమిసంహారక మందు తాగాడు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాచన్పల్లికి చెందిన రైతు ఆకుల పెద్ద గంగాధర్(63) 20 ఏళ్లు గల్ఫ్లో ఉండి ఐదేళ్ల క్రితం వచ్చాడు. తనకున్న ఆరు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. పలుమార్లు బోర్లు వేసినా నీరు పడకపోవడంతో ఈ ఏడాది రెండు ఎకరాలే సాగు చేశాడు. కరెంటు సరిగా లేకపోవడంతో దిగుబడి సరిగా రాలేదు. మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడతలపల్లికి చెందిన రైతు కావలి వెంకన్న(35) తండ్రితో కలిసి తమకున్న నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. వ్యవసాయ అవసరాలకు గతేడాది రూ. లక్షకు పైగానే అప్పు చేశాడు. ఈ ఏడాది కూడా అప్పులు చేశాడు. అప్పుల వారి వేధింపులు పెరగడంతో మంగళవారం సాయంత్రం వ్యవసాయభూమి వద్ద క్రిమిసంహారక మందు తాగాడు.
సంస్థాన్నారాయణపురం మండలం అలుగుతండాకు చెందిన మహిళా రైతు కరంటోతు సునీత(25) భర్త కిషన్తో కలిసి పత్తిసాగు చేస్తున్నారు. సాగు కోసం రూ. 2 లక్షల వరకు అప్పు చేశారు. పంట దిగుబడి రాకపోవడం.. అప్పుల వారి వేధింపులు పెరగడంతో మనస్తాపానికి గురై మంగళవారం క్రిమిసంహారక మందు తాగింది. నేరేడుచర్ల మండలం బొత్తలపాలెం పరిధి లాలీతండాకు చెందిన రైతు బానోతు కిట్టు అలియాస్ కృష్ణ(32) రెండున్నర ఎకరాల్లో వరి, కౌలుకు తీసుకున్న రెండున్నర ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం రూ. 4లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు దెబ్బతినడంతో క్రిమిసంహారక మందు తాగాడు.
మెదక్ జిల్లా సదాశివపేట మండలం తంగెడపల్లికి చెందిన రైతు ఎల్లారం రాములు తన ఎకరం పొలంతో పాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు. సాగుకు రూ. లక్షకు పైగా అప్పు చేశాడు. పంట దెబ్బతినడంతో అప్పులెలా తీర్చాలో తెలియక క్రిమిసంహారక మందు తాగాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లి రైతు ముసిపట్ల రాజారెడ్డి (45) 3 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, వరి వేశాడు. రెండేళ్లుగా దిగుబడి రాలేదు. పెట్టుబడి కోసం రూ.80 వేలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేక మనోవేదనతో గుండెపోటుకు గురయ్యాడు.
ప్రాణాలు తీస్తున్న అప్పులు
Published Thu, Nov 13 2014 3:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఇరగదీస్తున్న చిచ్చరపిడుగులు వీళ్లే..!
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
బీజేపీనా? సమాజ్వాదీనా? రూ. 2 లక్షలకు లాయర్ల బెట్టింగ్!
Shaleena Nathani: డిఫరెంట్ స్టార్స్తో పనిచేయడమంటే.. చాలా ఇంట్రెస్టింగ్!
టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్
డిజిటల్ ఫ్లాట్ఫామ్లో మరో ఓటీటీ సంస్థ!
లీడర్ VS చీటర్స్
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement