ముదుమాణిక్యం మేజర్‌ కాల్వకు గండి | Sakshi
Sakshi News home page

ముదుమాణిక్యం మేజర్‌ కాల్వకు గండి

Published Fri, Feb 6 2015 1:46 PM

fields under mudumanikyan major canal in nalgonda distirict

నల్గొండ:   నల్గొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని ముదుమాణిక్యం మేజర్‌ కాల్వ ఎన్-17 వద్ద  శుక్రవారం గండి పడింది. ఈ సంఘటనతో సుమారు 200 ఎకరాల మేరా పంట పూర్తిగా నీట మునిగింది. నీటి ప్రవాహానికి ఈ మధ్యే నాటేసిన ఎనిమిదెకరాల పొలం వేర్లతో సహా కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

స్థాయికి మించి నీటిని విడుదల చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా కాల్వకట్టలు బలహీనంగా ఉండటం వల్లే తరుచూ గండ్లు పడుతున్నాయని రైతులు ఆందోళ న వ్యక్తం చేస్తున్నారు.
(త్రిపురారం)

Advertisement
Advertisement