సాక్షిప్రతినిధి, వరంగల్ : కేంద్రంలో ఏర్పడనున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం లో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయ మైంది. తెలంగాణకు సంబంధించి టీడీపీ కోటాలో ఎవరికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి తెలంగాణలో మల్కాజ్గిరి లోక్సభ స్థానం ఒక్కటే దక్కింది. ఈ స్థానం నుంచి గెలిచిన మల్లారెడ్డి ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. దీంతో తెలంగాణకు సంబంధించి టీడీపీ కోటాలో రాజ్యసభ సభ్యులకే అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. జిల్లాలోని ఇద్దరు రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్రావు, గుండు సుధారాణిలలో ఒకరికి అవకాశం వస్తుందని టీడీపీ శ్రేణులు ఆశిస్తున్నాయి.
ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత గరికపాటి మోహన్రావుకు కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశం మెండుగా కనిపిస్తోంది. టీడీపీ అధినేతతో ఉన్న సాన్నిహిత్యం గరికపాటికి ప్రధాన అనుకూలతగా ఉంది. 2004లో అధికారం కోల్పోయిన రోజు నుంచీ.. గరికపాటి మోహన్రావు రాజకీయంగా, ఆర్థికంగా టీడీపీకి అండగా ఉంటున్నారు. చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీకోసం’తో పాటు భారీ కార్యక్రమాలకు గరికపాటి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ అంశాలతోనే ఇటీవల గరికపాటికి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. సాధారణ ఎన్నికల్లో గరికపాటి తెలంగాణలోని పలువురికి ‘సహకారం’ అందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల సమన్వయ బాధ్యతలను గరికపాటి నిర్వహించారు.
ఈ మూడు జిల్లాలో కలిపి టీడీపీకి 44 సీట్లు వచ్చారుు. ఏడు లోక్సభ స్థానాల్లోనూ విజయం సాధించింది. టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో గరికపాటికి మరింత గుర్తింపు వచ్చిందని, తెలంగాణ కోటాలో ఈయనకు కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణలో పార్టీని పటిష్ట పరచడంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు... అన్ని రకాలుగా తనకు విధేయుడిగా ఉండే గరికపాటి మోహన్రావుకు ఈ అవకాశం కల్పిస్తారని అంటున్నారు. జిల్లాలోని మరో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పేరు సైతం కేంద్ర మంత్రి వర్గం విషయంలో పరిశీలనకు వస్తుందని ఆమె వర్గీయులు చెబుతున్నారు.
కేంద్ర మంత్రివర్గంలో చోటు!
Published Sat, May 24 2014 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement