విద్యుదాఘాతంతో ఆరు పూరిళ్లు దగ్ధం | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఆరు పూరిళ్లు దగ్ధం

Published Fri, May 22 2015 4:09 PM

Fire accident in Vemanpalli

వేమన్‌పల్లి : ఆదిలాబాద్ జిల్లా వేమన్‌పల్లి మండలం లింగాల గ్రామంలో విద్యుదాఘాతం కారణంగా శుక్రవారం ఆరు పూరిళ్లు దగ్ధమయ్యాయి. వేసవికాలం కావటంతో మంటలను అదుపు చేయడం గ్రామస్తులకు కష్టమైంది. దీంతో గ్రామస్తులు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు.

గ్రామానికి 38 కి.మీల దూరంలో ఉన్న బెల్లంపల్లి నుంచి ఫైరింజన్లు రావాల్సి ఉంది. ఫైరింజన్లు వచ్చేలోపు మంటలు వేరే ఇళ్లకు వ్యాపిస్తాయేమోనని గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement