భైంసా జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

భైంసా జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

Published Thu, Mar 12 2015 4:41 PM

భైంసా జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం - Sakshi

భైంసా (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలోని కమలా జిన్నింగ్ మిల్లులో గురువారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాలు... ట్రాక్టర్‌తో పత్తిని ఓ చోటకు చేరువేస్తుండగా సెలెన్సర్ నుంచి నిప్పు రవ్వలు లేచి పత్తికి అంటుకున్నాయి. వెంటనే సమాచారం అందించటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతున్నారు. మిల్లు ఆవరణలో వెయ్యి క్వింటాళ్ల పత్తి నిల్వ ఉంచారని సమాచారం. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇక్కడ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement