పులిచింతల ప్రాజెక్టు వద్ద ఘోర ప్రమాదం
అచ్చంపేట/ మేళ్లచెర్వు/జగ్గయ్యపేట : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల పరిధిలోని వజినేపల్లి వద్ద పులిచింతల ప్రాజెక్ట్పై జెన్కో నిర్మిస్తున్న పవర్ ప్రాజెక్ట్లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పులిచింతల ప్రాజెక్ట్లో విద్యుదుత్పాదన కోసం జెన్కో 120 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నది. నిర్మాణ పనుల్లో భాగంగా ప్రాజెక్ట్ చుట్టూ రక్షణగోడ నిర్మిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రాజెక్ట్కు ఒక పక్కగా ఉన్న మట్టికట్ట వద్ద గోడ నిర్మించేందుకు సుమారు 30 మంది కూలీలు పనిచేస్తున్నారు. భోజన సమయంలో 25 మంది కూలీలు బయటకు రాగా, కాంట్రాక్టర్ మరో ఐదుగురు కూలీలు అక్కడే పనిచేస్తున్నారు. దానిపక్కనే ఎర్త్ డ్యాం నిర్మాణానికి వినియోగించగా మిగిలిన మట్టిని పెద్ద కుప్పగా పోశారు. దానినుంచి పెద్ద మట్టిగడ్డ విరిగి వీరిపై పడింది. దీంతో వారంతా మట్టిలో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒక కూలీ సురక్షితంగా బయటపడగా, కాంట్రాక్టర్తో పాటు మరో నలుగురు సజీవ సమాధి అయ్యారు.
మృతుల్లో మహబూబ్నగర్ జిల్లా సున్నిపెంటకు చెందిన పోతన గోపాలకృష్ణ (35), మేళ్లచె ర్వు మండలం వజినేపల్లికి చెందిన బారెడ్డి గోవిందరెడ్డి (45), మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగరవేలి జిల్లా బరిల్బరిది గ్రామానికి చెందిన నందుకోల్(20), ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సారంగ్పూర్ జిల్లాకు చెందిన మహ్మద్ఖలీల్ (23), పశ్చిమబెంగాల్ రాష్ట్రం ప్రాన్స్పుర గ్రామానికి చెందిన సుబ్బురాయ్పాడవాయ్(35)లు ఉన్నారు. మృతదేహాలను నల్గొండ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాజెక్టు సీఈ రమేష్బాబు, ఎస్ఈ చంద్రశేఖర్ పరిస్థితిని సమీక్షించారు. జెన్కో పవర్ ప్రాజెక్టు తమ పరిధిలో లేదని దీనికి సంబంధించిన తదుపరి సహాయక చర్యలను పవర్ ప్రాజెక్టు అధికారులు అందించవలసి ఉంటుందని చెప్పారు. కాగా, ప్రమాద స్థలాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రాత్రి పరిశీలించారు. మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. జెన్కో రూ.2 లక్షలు, కార్మిక శాఖ మరో రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తక్షణమే మట్టి ఖర్చుల కింద రూ.10 వేల చొప్పున కార్మిక శాఖ అందజేయనుంది. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమ తెలిపారు.
మట్టిగడ్డ కూలి ఐదుగురి దుర్మరణం
Published Sat, Jul 12 2014 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement