‘ప్రాణహిత’ అటవీ భూములకురాని క్లియరెన్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ వరప్రదాయని ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు అటవీశాఖ అడ్డంకులు తొలిగేనా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్యానికి తోడు, కేంద్ర పర్యావరణ అటవీశాఖల అనుమతులు లభించకపోవడంతో పనులు అర్ధంతరంగా నిలిచాయి. ఇప్పుడు రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా, కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు జోగు రామన్న, ఎస్.వేణుగోపాలాచారిలు నియమితులు కావడం, ప్రధాని వద్ద ప్రాణహిత అంశం కేసీఆర్ తీరుకురావచ్చిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో ఉన్న 16.40 లక్షల ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతోపాటు, వందలాది గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందు కు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మహానేత మరణం తరా్వాత సర్కారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేసింది. ముఖ్యంగా అటవీశాఖ క్లియరెన్సులు రాకపోవడంతో పనులు ఆగాయి. దీంతో ఈ ప్రాజెక్టు వ్యయం ఏటా పెరుగుతూ తడిసి మోపెడవుతోంది.
అటవీ భూములతో అడ్డంకులు
ఈ ప్రాజెక్టు లింక్-1 పరిధిలో ఐదు ప్యాకేజీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 8,465.76 ఎకరాల భూమిని సేకరించాలని నీటి పారుదలశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 3,061 ఎకరాలు మాత్రమే సేకరించగలిగారు. మిగిలిన 5,404 ఎకరాల్లో 3,457 ఎకరాలు అటవీ భూములున్నట్లు గుర్తించారు. ఈ 3,457 ఎకరాలకు అటవీశాఖ అనుమతులు లభించడం లేదు. దీంతో పనులు అర్థాంతరంగా నిలిచాయి. ముఖ్యంగా నాలుగో ప్యాకేజీ పనులకు ప్రధాన అడ్డంకిగా మారింది.
43 కిలో మీట ర్ల కాలువ నిర్మించాల్సి ఉండగా అటవీశాఖ క్లియరెన్స్ లేకపోవడంతో 18 కిలోమీటర్ల మేరకు పను లు నిలిచాయి. ఈ ప్యాకేజీ పనుల పరిధిలో 2,387 ఎకరాల అటవీ భూములున్నాయి. బెల్లంపల్లి, కాగజ్నగర్ అటవీ డివిజన్ల పరిధిలో ఉన్న కూచవెల్లి, కొండపల్లి, సారంగపల్లి, కుష్ణపల్లి అట వీ ప్రాంతంలో పనులు ఆగిపోయాయని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అటవీశాఖ పరిశీలనలో ప్రతిపాదనలు
ఈ ప్రాజెక్టు పనులతో ముంపునకు గురికానున్న అటవీ భూములకు సంబంధించిన నీటి పారుదల శాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలు అటవీశాఖ పరిశీలనలో ఉన్నాయి. ముంపునకు గురికానున్న అటవీ భూముల్లో ఉన్న చెట్ల గణన, ఇతర వనసంపద విలువ లెక్కింపు పూర్తయితే ఈ భూములకు అనుమతులు మంజూరుకు మార్గం సుగమమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద నిర్మిస్తున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణం పనుల వివరాలు ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు నుంచి ఆదేశాలందాయని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అడ్డంకులు తొలిగేనా?
Published Mon, Jun 9 2014 3:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement